ఇది కాల్పుల విరమణ ఒప్పందం కాదా.. అంగీకారం మాత్రమేనా.. భారత్ పాక్‌కు ఇచ్చిన్న రెండు ఆప్షన్స్ ఇవే..!

భారత్ పాకిస్తాన్‌ల‌ మధ్య గత మూడు రోజులుగా కొనసాగుతున్న యుద్దాలకు తాజాగా చేక్ ప‌డింది. కాల్పుల విరమణ అంశాన్ని అటు పాకిస్తాన్ తో పాటు.. ఇటు భారతదేశం కూడా ధ్రువీకరించింది. అయితే ఇది కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కాదట.. కేవలం అంగీకారమేనని సమాచారం. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించడంతో.. భారత్‌, పాకిస్తాన్‌ల‌ మధ్య గత 90 గంటలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగింది. ఇందుకు సంబంధించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మేస్త్రి మాట్లాడుతూ.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్ డీజీఎంవో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు భారత డీసీఎంకు ఫోన్ చేశారని.. భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి ఉపరితల, వాయు, జలమార్గాల్లో అన్ని రకాల కాల్పులు సైనిక చర్యలను నిలిపేయాలని వాళ్ళ మధ్య అంగీకారం కుదిరింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ అవగాహనను అమలు చేయడానికి రెండువైపులా సూచనలు ఇచ్చాం.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మే 12 మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు అంటూ వివరించాడు. అదే టైంలో భారత విదేశాంగ‌ మంత్రి ఎస్ జై శంకర్ కూడా ఎక్స్ లో తన పోస్ట్‌ షేర్ చేసుకున్నాడు. భారత్, పాక్ కాల్పులు.. సైనిక చర్యలను నిలిపివేయడంపై ఈరోజు ఒక అవగాహన ఏర్పడిందని.. ఉగ్రవాదం యొక్క అన్ని రూపాలు వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా భారతదేశ నిరంతరం దృఢమైన, రాజీలేని వైఖరిని కొనసాగించిందంటూ చెప్పుకొచ్చాడు. అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు పాక్‌.. విదేశాంగ మంత్రి విశాఖ ధార్ పాకిస్తాన్ భారతదేశం తక్షణమే కాల్పులు విరమణకు అంగీకరించాయి.

పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సామగ్రాతపై ఎక్కడ రాజీ పడకుండా.. ఈ ప్రాంతంలో శాంతిభద్రత కోసం ఎల్లప్పుడు కృషి చేస్తుంది అంటూ వివరించాడు. ఇక కాల్పుల విరమణ అంగీకారం విషయంలో పాకిస్తాన్ బయట ప్రపంచానికి ఏం చెప్పినా.. భారత్ మాత్రం దీనిపై పూర్తి స్పష్టమైన వైఖరితో ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా వెల్లడించిన భారత్.. మొదటి తమకు పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందట‌. అయితే ఇక్కడ పాకిస్తాన్ ముందు భారత్ రెండు ఆప్షన్లో ఉంచినట్లు సమాచారం. ఒకటి ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, రెండు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే చర్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ స్పష్టంగా పాకిస్తాన్ కు వివరించారట.

Pakistan is no longer a priority for India - The Statesman

ఎందుకంటే పహాల్గాం ఉగ్ర‌ దాడి తర్వాత.. సీమాంతర ఉగ్ర‌వాదాని ప్రోత్సహిస్తుందని కారణంతో.. పాకిస్తాన్ విషయంలో భారత్ కొన్ని కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆపరేషన్స్ సింధూర్ పేరుతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్తాన్ పివికెలో 9 ఉగ్ర స్థావరాలపై మాత్రమే భారత్ దాడులు చేసింది.. పాకిస్తాన్ పౌరులు, సైన్యం జోలికి మేము వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే.. తర్వాత పాకిస్తాన్ వరుసగా దాడులకు తెగబడినా.. వాటిని భారత్ తలాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నా.. అదే టైంలో రెచ్చగొట్టే ధోరణికి వ్యవహరిస్తున్న పాక్‌కు గట్టి సమాధానమే ఇచ్చాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ వైమానిక వ్యవస్థ, సైనిక స్థావరాలపై ప్రతి దాడులు చేసిందని వెల్లడించింది.

ఇక భారత్ ఎలాంటి సమయంలోనైనా కేవలం ఉగ్రవాదులపై మాత్రమే ఫోకస్ చేశామని.. పాకిస్తాన్ మీద కాదని.. భారత్ క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయకులను దారుణంగా హత్య చేయడంపై భారత్ సీరియస్ అయింది. దేశంలో ఉగ్రవాదుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే తాజా ఉద్రిక్త‌త‌ నేపద్యంలో భారత్‌కు గట్టి హెచ్చరికను జారీ చేసింది. భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యను భారతదేశం వ్యతిరేక యుద్ద చర్యగా పరిగణిస్తుందని.. అందుకు అనుగుణంగానే ప్రతిస్పందిస్తుందని.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు.. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలను ఊటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే పాకిస్తాన్ గతంలో మాదిరి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. ఈసారి భారత్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ చాలా బలమైన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.