ఇండో – పాక్ వార్ ఆపిన క్రెడిట్ ట్రంప్ ది కాదట.. అసలు జరిగింది ఇదే..!

భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త‌త‌ మోగింది. ఈ రెండు దేశాల కాల్పుల విరమణ అంగీకరించడం అఫీషియల్ గా ధ్రువీకరించడం చూస్తూనే ఉన్నాం. కాల్పుల విరమణ అమెరికా మధ్య వర్తిత్వం వ‌హించినట్లు.. రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపినట్లు అమెరికన్ దేశ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ వివరించాడు. దీంతో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ ఒప్పుకుందని పేర్కొన్నాడు. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రోమియో కూడా దీనిపై స్పందించి.. తమ మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రకటించాడు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చాడు. మేము భారత్ ప్రధాని మోడీ, పాక్ ప్రధాని శభాష్ షరీఫ్ తో పాటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ, జాతీయ భద్రత సలహాదారులు అజిత్ దోవల్, అసిన్ మాలిక్ తో మాట్లాడమని పేర్కొన్నాడు. చర్చలో అమెరికా నుంచి తనతో పాటు తమ దేశ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ కూడా పాల్గొన్నారు అని చెప్పుకొచ్చాడు.

48 గంటల పాటు సుదీర్ఘ చర్చలు తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. నిజంగా అమెరికా మధ్యవర్తిత్వమే కారణమని అంతా భావించారు. అయితే.. వాస్తవానికి అమెరికా వల్లే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. భారత్ ఎక్కడ ప్రకటించలేదు. పాకిస్తాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పినా.. అమెరికా పేరు ప్రస్తావించింది లేదు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్ (డీజీఎంవో) ఇవ్వాల మధ్యాహ్నం 3:30కు భారత డీజిఎంకు ఫోన్ చేశాడు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భూమి, గ‌గ‌నతల, సముద్రం అన్ని రకాల కాల్పుల సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేస్తాయని ఒప్పందం కుదుర్చుకున్నామని.. దాని అమలు చేయడానికి రెండు వైపులా నుంచి సూచనలు ఇచ్చామని.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మే 12న మళ్లీ చర్చలు జరుపనుందని.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నాడు. అమెరికా పేరుని మాత్రం అసలు ప్రస్తావించనేలేదు.

ఇక భారత విదేశాంగ మంత్రి ఎస్ జె శంకర్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇరు దేశాల ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదం పై భారత్‌కి ఉన్న రాజీలేని వైఖరి మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అమెరికా మధ్యతత్వం వహించిందని ఆయన మాట్లాడలేదు. ఇక పాకిస్తాన్ ప్రధాని ఇషాక్ షరీఫ్.. ఇరుదేశాల కాల్పుల విరమణ గురించి మాట్లాడుతున్న సమయంలో అమెరిక మద్యవ‌ర్తిత్వం వహిస్తుందన్న అంశం మాత్రం తీసుకురాలేదు పాక్. ఎప్పుడు శాంతిభద్రతలను కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సామగ్రిత పై రాజీ పడకుండానే కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు.

ఇలా పాకిస్తాన్‌తో ఉన్న అన్ని సమస్యలను వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని.. భారత వైఖరికి అనుకూలంగా ఇండియా పాక్ మధ్య మాత్రమే చర్చలు జరిగాయని.. అధికారులు పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య జరిగిన చర్చల్లో మూడో దేశం పాత్ర ఉందన్న వాదనలు ఓ సీనియర్ అధికారి క్లియర్‌గా తిరస్కరించాడు. ఇక రెండు రోజుల క్రితం పాక్ న్యూస్ ఇంటర్వ్యూలో జెడి వాన్స్ మాట్లాడుతూ ఈ అంశంతో ఏమాత్రం సంబంధం లేదని.. ఆ అంశం మాకు అవసరం లేదని పేర్కొన్నాడు. తీవ్రతను కాస్త తగ్గించుకోవడానికి ప్రోత్సహించడమే తామ చేయగలిగిన పని అంటూ వివరించాడు. ఈ యుద్ధం మధ్యలో తమ జోక్యం చేసుకోబోమని చెప్పుకొచ్చాడు. అది ప్రాథమికంగా తమకు సంబంధించినది కాదంటూ వెల్లడించాడు. ఇప్పుడేమో తమ జోక్యం వల్లే భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ జరిగిందంటూ ట్రంప్ ప్రకటించాడు.