తాజాగా కేంద్రం ఆపరేషన్ సింధూర్పై క్లారిటీ ఇచ్చింది. సింధూర్ ఇంకా ముగ్గియలేదని తెల్చి చెప్పిన కేంద్రం.. ఆపరేషన్ సింధూర్ గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో.. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మద్దతు గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూరలో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పేర్కొంది. సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోతున్నాయని.. పాకిస్తాన్ స్పందనకు అనుగుణంగా కఠినంగా పూర్తిస్థాయిలో స్పందించేందుకు సర్వం సిద్ధంగా ఉందని.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఆపరేషన్ సింధుర్ గురించి అఖిలపక్ష నేతలకు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని.. ఆపరేషన్ పూర్తి కాకుండా భవిష్యత్ కార్యాచరణ వెల్లడించలేమంటూ వివరించింది. పాక్తో పాటు.. పిఓకెలో జరిగిన దాడుల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్.. సైనిక చర్య, తదుపరి పరిణామాలు, దేశ భద్రత చర్యలు, ప్రతిపక్షాలకు విడమర్చి చెప్పారు. దేశభద్రత విషయంలో ఎలాంటి చర్యల కైనా సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.
దేశం మొత్తం కలిసికట్టుగా ఉందనే విధంగా నాయకులంతా మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యాన్ని అభినందించడంతోపాటు.. భద్రతకు సంబంధించి విషయాలు ప్రభుత్వం చెప్పింది. మేము ఉన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే అన్నారు. దేశభద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలను వెల్లడించలేకపోతున్నామని.. రక్షణ మంత్రి వివరించారు. ఈ విషయాన్ని తాము గౌరవించామని కార్గే పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పమంటూ వివరించారు.