పహల్గామ్ సంఘటన.. అమాయకపు యువకులను హతమార్చిన ఉదాంతం పై ప్రపంచ దేశాలన్నీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్పై ప్రతి కారంతో రగిలిపోయిన భారత్.. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. ప్రతీకారాన్ని తీర్చుకుంది. దాదాపు 9 వగ్రస్థావరాలను నేలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్, భారత్ల మధ్య ప్రత్యక్ష దాడులు మొదలయ్యాయి. పరస్పరం భారత్, పాకిస్తాన్ వార్ నేపద్యంలో భారత్.. పాకిస్తాన్ ప్రతిదాడులు అన్నిటిని సమయస్ఫూర్తితో తిప్పికొడుతుంది. పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను గగనతనంలోనే బ్లాస్ట్ చేస్తూ భరత్ ఆర్మీ సత్తా చాటుకుంటుంది.
ఇలాంటి క్రమంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దానికి కారణం హైదరాబాద్లో కలకలం రేపుతున్న బెదిరింపు కాల్. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు పెట్టినట్లు ఈరోజు అధికారులకు ఓ మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ కు వెంటనే అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో తనిఖీలను ముమ్మరం చేశారు. కంటిన్యూస్గా సెర్చింగ్ లో నిర్వహిస్తున్నారు. నిజంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారా.. లేక ఒక బెదిరింపు కాలు మాత్రమేనా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇలాంటి క్రమంలో భారత్, పాక్ మధ్య దాడులు.. ప్రతిదాడులు నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన ఏర్పాట్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అనేక ఫ్లైట్లను ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. క్షుణ్ణంగా తనకి చేసిన తర్వాత ప్రయాణికులను ఏర్పాట్లకు అనుమతిస్తున్న నేపథ్యంలో.. పంజాబ్, కాశ్మీర్, జమ్మూ, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 ఎయిర్ పోర్ట్లను కేంద్రం పూర్తిగా మూసేసింది. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే.. మరిన్ని ఎయిర్పోర్ట్లను కూడా మూసేసే అవకాశం ఉంది. కాగా.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబ్ అంటూ అధికారులకు పెట్టిన మెయిల్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. సమీప ప్రాంతాల్లో ప్రజలలో ఆందోళన మొదలైంది. ఇక నిజంగానే శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు ఉందా.. లేదా కేవలం పాక్ మరోసారి ఫేక్ గేమ్ ఆడుతుందా తెలియాల్సి ఉంది.