పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం ప్రతీకర చర్యగా ఆపరేషన్స్ సింధూర్ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతదేశం మాపై దాడులు చేసిందని.. మూడు మిలిటరీ ఏయిర్ స్పేస్ల మీద ఎటాక్ చేసిందని చెప్పుకొచ్చింది. పాక్ డైరెక్టర్ జనరల్ లెప్ట్నెంట్ జనరల్.. అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చాడు. దానికి ప్రతికారంగానే మేము దాడులు చేపించామని వివరించాడు. పంజాబ్.. తదితర ప్రాంతాల్లో ఆరు బాలిస్టిక్లను ప్రయోగించమని చెప్పుకొచ్చిన షరీఫ్.. భారత్ ప్రారంభించిన దాన్ని ముగించడానికి మా సైన్యం కూడా సిద్ధమవుతుందంటూ పేర్కొన్నాడు. ఆపరేషన్స్ సింధూర్కు వ్యతిరేకంగా ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ను ప్రారంభించినట్లు ప్రకటించాడు.
ఈ ఆపరేషన్ లో భాగంగానే నిన్నటి రాత్రి నుంచి పాకిస్తాన్ వరుసగా భారత్ పై దాడులకు తెగ పడుతూనే ఉంది. ఇక పహల్గాం దాడిలో ఉగ్రవాదులు కావాలని మగవారిని మాత్రమే చంపుతూ.. భారతీయులు పవిత్రంగా భావించే సింధూరాన్ని చెరిపేసామని ఆనందంతో విర్రవీగారు. దానికి ప్రతికారంగానే ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై దాడులకు దిగింది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ బున్యాన్ ఉన్ మర్సూస్ ఆపరేషన్ను ప్రారంభించింది. ఇక ఈ ఆపరేషన్ అర్థం గాజు లాంటి బలమైన గోడ.. చాలా బలంగా రక్షించే గోడ అట. ఈ పేరుతో ప్రపంచానికి.. పాకిస్తాన్ తనని తానే బలంగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఆపరేషన్ పేరు పెట్టిన వెంటనే భారత్ పై ఫతే 1 క్షిపణితో సహా.. డ్రోన్లు వరుసగా ప్రయోగిస్తూ వచ్చింది. అయితే పాకిస్తాన్ ఈ మిషన్ పేరును ఖురాన్ లో ఒక శ్లోకం నుంచి తీసుకుంది. ఇక పాకిస్తాన్ ఏ పేరు పెట్టిన.. ఎలాంటి దాడి చేసిన భారత్ ని మాత్రం ఆపడం ఎవరి వల్ల కాదు. భారత్ వరుస పెట్టి పాకపై దాడులు చేస్తూనే ఉంది. పాక్ ఎదురు తాడులను తిప్పికొడుతూనే ఉంది. ఆ దెబ్బలు వాళ్లకు చాలా స్ట్రాంగ్ గా తగులుతున్నాయి. దానికి తోడు పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు టటటటార్గెట్ పాయింట్ రీచ్ కాకముందే గగనతలంలోనే భారత సైన్యం తునా తునకలు చేస్తుంది. ప్రయోగించిన స్థానాలకు చేరకముందే నేల కూల్చేస్తుంది.