టెరిటోరియల్ ఆర్మీకి బోర్డర్ నుంచి పిలుపు.. సచిన్, ధోని వెళతారా..?

రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ భారత్ పై విచ్చలవిడిగా దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని ఇండియన్ ఆర్మీ గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన దాడులను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న భారత్.. నిన్నటి నుంచి పాక్‌ చేస్తున్న క్షిపని, డ్రోన్ దాడులను తిప్పికొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, త్రివేది దళపతి తో సమావేశం అవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది.. నౌకాదశి అడ్మరల్ దినేష్ కే త్రిపాఠి, నావి అధిపతి ఏర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

9 Celebrities Who Are In Armed Forces to motivate youth toward the armed forces. | by udiBaba | udChalo

ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీని మరింత దృఢంగా తయారు చేయాలని.. మరి అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలంటూ కేంద్ర ఆర్మీ చీఫ్ కేంద్రం అధికారాలు ఇచ్చేసింది. ఇక భారత్ పాక్ మధ్య నెలకొన్న ఈ టెన్షన్ వాతావరణంలో ఆర్మీ చీఫ్ అధికారులను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెరిటోరియల్ ఆర్మీలో అందరూ అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని వెంటనే బోర్డర్ కు పిలవడానికి అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో భరత్ ఆర్మీ తో కలిసి ప్రత్యర్థి తో తలపడేందుకు టెరిటోలను ఆర్మీ సిద్ధంగా ఉంటుంది.

10 Famous Personalities Held Highly Designated Posts In The Indian Army You Probably Didn't Know

ఇందులో సిబ్బంది అధికారులకు జనరల్ ఆర్మీకి లాగే అన్ని ట్రైనింగ్లు ఇచ్చేస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేస్తూనే స్వచ్ఛందంగా ఆర్మీతో పని చేస్తూ దేశ‌సేవ చేస్తారు. ఇందులో కనీస అర్హత సర్విస్ పూర్తి చేసిన వారికి పెన్షన్లతో పాటు.. ఇతర ప్రయోజనాలు.. అంటూ క్యాంటీన్, మెడికల్, ఎల్‌టి అలోవెన్స్‌ సహజంగానే వస్తాయి. 1962, 65, 71 యుద్దల్లో భారత సైన్యంతో కలిసి.. ఈ టెరిటోరియల్ ఆర్మీ ఎంతో గొప్పగా పనిచేశారు. అందులో ఇప్పటికీ 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను తక్షణమే బోర్డర్లకు రప్పించాలని ఆర్మీ నిర్ణయించుకుంది. పార్ట్ టైం వాలంటరీలతో కూడిన మిలిటరీ రిజర్వ్డ్ ఫోర్స్.. ఇందులో అధికారులు జూనియర్ కమిషన్ ఆఫీసర్లు, నాన్ కమిషన్ ఆఫీసర్లు ఇలా రకరకాల సిబ్బంది ఉంటారు. వీరు భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంక్ క‌లిగి ఉంటేనే సమాజంలో తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ టెరిటోరియల్ ఆర్మీ లిస్టులో చాలామంది ప్రముఖుల సైతం ఉన్నారు.

Meet Famous Personalities Who Were Bestowed With Highly Designated Ranks In The Indian Armed Forces

అలాంటి సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఘట్టర్ అభినందిరా, అనురాగ్‌, ఠాగూర్, సచిన్ పైలెట్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్, నాన్న పటేల్ తదితరులు ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎమ్మెస్ ధోని లెఫ్టెనెంట్‌ హోదాలో 106మెంట్లో ఉండగా.. సచిన్ టెండూల్కర్.. భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అయితే.. దేశ రక్షణ టెరిటోరియల్ ఆర్మీ పాత్ర చాలా కీలకంగా ఉండ‌నుంది. ఈ క్రమంలో ధోని, సచిన్ లాంటి క్రికెటర్లను యుద్ధానికి పంపితే వారి పాత్ర కూడా చాలా ముఖ్యమవ్వచు. అయితే.. అది ప్రస్తుతం ఉన్న సైన్యం అవసరాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో భారత స్టాక్ క్రికెటర్ హేము అధికార రెండవ ప్రపంచ యుద్ధంలో హాజరయ్యారు. ఆ సమయంలో అతనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది.