భారత్‌లో హై అలర్ట్.. ఆ 24 ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన పాక్..!

పాకిస్తాన్ – భారత్‌ల‌ మధ్య యుద్ధ వాతావరణంతో తీవ్ర ఉద్రిక‌తత‌ నెలకొన్న సంగతి తెలిసిందే. పరస్పరం భారత్, పాకిస్తాన్‌లు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. తాజాగా పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. మరోసారి భారత్ పై దాడి చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 24 సరిహద్దు నగరాలను టార్గెట్ చేసిన పాక్.. దాదాపు 500 డ్రోన్లతో దాడులకు తెగబడింది. వెంటనే అలర్ట్ అయిన భారత బలగాలు సమయస్ఫూర్తితో పాక్ డ్రోన్‌ల‌ను గగనతలంలోనే మట్టు పెట్టేసాయి.

5 Reasons India And Pakistan Could Be On A Brink Of An All-Out War

మరోవైపు ఆపరేషన్ సింధూరం గా కొనసాగుతున్న క్రమంలో.. దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, గుజరాత్, జమ్మూకాశ్మీర్ లాంటి కీలక ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. గురువారం రాత్రి లాగే.. మరోసారి పాక్.. భారత్ పై దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే.. ఇస్రో కేంద్రాల దగ్గర హై అల‌ర్ట్‌ ప్రకటించిన భారత్.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట, బెంగళూరు సహా 11 ఇస్రో కేంద్రాలలో అలర్ట్ సైరన్ మోగించింది. పాక్ యుద్ధంతో ఉద్రిక్తత నేపథ్యంలో ఇస్రో కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Army on high alert along LoC in Sunderbani ahead of Independence Day –  Rising Kashmir

రాజస్థాన్‌లోను సాయంత్రం ఐదు గంటల నుంచి ఇళ్లలోనే ఉండాలని భారత్‌ ఆదేశాలు జారీ చేయడంతో పాటు.. ఢిల్లీ పౌరులను భద్రత దళాలు అప్రమత్తం చేశాయి. ఉద్రిక్తత‌ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం విషయంలో విమానాశ్రయ శాఖ సైతం కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ విమానాశ్రయం తెరిచే ఉందని కానీ.. కొన్ని సర్వీస్ లు మాత్రం రద్దు అవుతున్నట్లు వెల్లడించారు. 9 అంతర్జాతీయ సర్వీసులు, 129 దేశీయ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులకు విమానాసయ‌శాఖ అడ్వైజర్.. ఎయిర్పోర్టులకు మూడు గంటలు ముందుగానే చేరుకోవాలని సూచించారు.