ఇండియన్ ఆర్మీ:CISF, BSF, ITBP, SSB ద‌ళాల‌ మధ్య తేడా ఇదే.. ఏ సరిహద్దు ఎవరు కాపాడతారంటే..?

భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి చర్చలను నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారా మిలిటరీ దళాలు ఉన్నాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రత దళం (BSF) ఎండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP ) సశ‌స్త్రా సీమా (SSB) దళాలు సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటాయి. ఈ దళలు మనదేశంలో సరిహద్దుల్లో విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. వీటితో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ (CRPF) హోం శాఖ కింద పని చేస్తూ ఉంటాయి.

ఇక మన దేశానికి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ సరిహద్దు దేశాలుగా ఉన్న క్రమంలో.. మొత్తం 15,000 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. ప్రధానంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారత సరిహద్దును కాపాడే ప్రాథమిక దళంగా వ్యవహరిస్తుంది. ఇది జమ్మూ – కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ల‌లో విస్తరించి ఉన్న నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దుల్లో దాదాపు 3323 కిలోమీటర్లను సురక్షితంగా ఉంచుతున్నారు. స్మగ్లింగ్, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా లాంటి సరిహద్దు నేరాలను ఈ టీం నిరోధిస్తూ ఉంటారు. శాంతి టైంలో BSF హోం మంత్రిత్వ శాఖ కింద విధులు నిర్వర్తిస్తుంది.

యుద్ధం జరిగినప్పుడు భారత సైన్యం వెనుక నిలుస్తూ ఉంటారు. భారత సైన్యంతో సమన్వయంగా పనిచేస్తూ ఉంటారు. యుద్ధ సమయంలో భారత్ మిలటరీ నియంత్రణ రేఖ LOC అంతర్జాతీయ సరిహద్దు ఐబి కంట్రోల్ తీసుకుంటుంది. BSF వీరికి సహకారం అందిస్తారు. BSF భారత్ బంగ్లా సరిహద్దులను కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరితో పాటు.. ఇతర సరిహద్దు ద‌ళాలలో ఇండోర్ టేబుల్ పోలీస్ ITBP. భారత్ చైనా సరిహద్దుల్లో పనిచేస్తూ ఉంటారు. సశ‌త్రా సీమాబల్ SSB.. నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో పనిచేస్తారు. అస్సాం రైఫిల్ పాలనాపరముగా హోం మంత్రిత్వ శాఖ కింద ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా నియంత్రిస్తూ ఉంటారు. ఇది భారత్ మైనర్ సరిహద్దుల్లో గస్తి నిర్వహించే దళం.

INDIAN ARMY - My Blog

ప్రతి దళం కూడా సరిహద్దుల్లో భౌగోళిక, వాతావరణ, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ITBP ఎత్తైన హిమాలయాల పరిస్థితుల్లో మోహరించబడుతుంది. దీనికి అనుగుణంగానే వారు శిక్షణ పొందుతారు. BSF నదులు, ఎడారిలో మైదాన ప్రాంతాల్లో కార్యక్రమాల్లో నిర్వహించే శిక్షణ తీసుకుంటారు. అస్సాం రైఫిల్స్ AR దట్టమైన అరణ్యాలు, కొండ ప్రాంతాల్లో వార్తేర్ శిక్షణను అందుకుంటారు. ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలోని కీలకమైన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలను గస్తీ కాస్త ఉంటుంది. విమానాశ్రయాలు, మెట్రో వ్యవస్థ, అను విద్యుత్ ప్లాంట్లు, ఇస్రో లాంటి అంతరిక్ష కేంద్రాలు ఉక్కు కర్మాగారాలు వద్ద భద్రతలు నిర్వహిస్తూ ఉంటారు. సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్స్ ఆందోళనలో.. అల్లర్లు, మతకలహాలు నిర్వహించడంతోపాటు.. ఎన్నికల టైం లో విధులు నిర్వర్తిస్తారు.