స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాలో తన నటనతో సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తర్వాత వరస సినిమాల్లో ఆఫర్లు కొట్టేసిన ఈ అమ్మడు.. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న గీత గోవిందం సినిమా చాలా స్పెషల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ సినిమా లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గాగా రూపొంది మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో.. విజయ్, రష్మికల మధ్య సాగే లవ్, రొమాన్స్ ప్రేక్షకులను మెప్పించాయి.
ఈ క్రమంలోనే హిట్ పెయిర్గా వీరికి మంచి ఇమేజ్ వచ్చింది. అంతే కాదు.. సినిమా షూట్ టైంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని.. ఈ క్రమంలోనే వీరిద్దరూ సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు ఎప్పటినుంచో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే.. వీరిద్దరూ కలిసి వెకేషన్లను ఎంజాయ్ చేయడం.. ఇద్దరు కలిసి ఒకే లొకేషన్ లో ఫోటోలు దిగడం.. ఇలా మీడియాకు ఎన్నోసార్లు దొరికిపోయారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన సినిమాల పరంగా మంచి ఫామ్లో దూసుకుపోతుంది. మరో పక్క విజయ్ దేవరకొండ తన సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ తాజాగా నటించిన మూవీ కింగ్డమ్.
ఈ సినిమాలో విజయ్కు జంటగా భాగ్యశ్రీ బోర్సే మేరవనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కనుందని.. అంతేకాదు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే టీజర్ ఫస్ట్ షాట్ లోనే హీరో హీరోయిన్ల మధ్య డీప్ లిప్లాక్ సీన్ చూపించారు. దీంతో ఈ టీజర్తో భారీ హైప్ నెలకొల్పింది. అయితే భాగ్యశ్రీ, విజయ్ లిప్ లాక్ సీన్స్ పై రష్మిక మందన సీరియస్ అయినట్లు టాక్ నెట్టింట వైరల్ గా మారుతుంది. రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్న క్రమంలోనే ఈ లిప్ లాక్ సీన్లు రొమాంటిక్ సన్నివేశాలపై ఆమె అసహనం వ్యక్తం చేసిందట. ఇలాంటి సన్నివేశాలకు కాస్త దూరంగా ఉండమని విజెయ్తో పాటు.. భాగ్యశ్రీ కి కూడా రష్మిక మందనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే ఈ ముద్దుగుమ్మ రియాక్ట్ అవ్వాల్సిందే.