టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టి.. తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే స్టార్ట్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక.. గతేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో సంచలనాలు సృష్టించాడు. ఈ క్రమంలోనే సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేసి సినిమాలను రూపొందిస్తూనే.. వేరువేరు కథలతో మరోవైపు తన యూనివర్స్ను కంటిన్యూ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.
ప్రస్తుతం కాంతారా ఫేమ్ రిషబ్శెట్టితో జై హనుమాన్ సినిమా రూపొందిస్తున్న ప్రశాంత్.. హనుమాన్కు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో పాటు.. రకరకాల సినిమాలను ఆడియన్స్ ముందుకు తన యూనివర్స్ నుంచి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ యూనివర్స్లో భాగం అవ్వాలని మెగాస్టార్ సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రశాంత్ వర్మ ఆలోచనలో మెగాస్టార్ లేకపోయినా.. మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ కోసం ప్రశాంత్ వర్మ సినిమాను రూపొందించనున్నడంటూ తెలుస్తుంది.
ఇక వరుణ్ తేజ్ ఫస్ట్ నుంచి ప్రయోగాత్మక సినిమాలను నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తను నటించిన అన్ని ప్రయోగాత్మక సినిమాలను సక్సెస్ కాకపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే పిసియు నుంచి వరుణ్ తేజ్తో ఓ సినిమా రానుంది అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అయితే.. అది ఎప్పుడు జరుగుతుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ప్రశాంత్ వర్మ యూనివర్స్ మూవీ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.