శుభం : నష్టాలు లేకుండా సమంత సేఫ్ బిజినెస్ స్ట్రాటజీ.. అదరగొట్టిందిగా

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. సౌత్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో నిర్మాతగా యూటర్న్ సినిమాకు వ్యవహరించింది. అయితే సినిమా సరిగ్గా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ నిర్మాతగా అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ తో అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. శుభంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. మే 9న‌ రిలీజ్ కానున్న ఈ సినిమా.. కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది.

ఇక.. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్‌ నెలకొన్న క్రమంలో.. భారీ బిజినెస్ జరుగుతుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించగా.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజై.. ట్రైలర్ ఆడియన్స్‌ను పీక్స్ లెవెల్లో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమా నాన్‌థియేట్రిక‌ల్‌ రైట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయని సమాచారం. జి గ్రూప్స్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ కూడా ఓటిటి డీల్స్ ను కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ఈ రెండు డీల్స్ తో శుభం టేబుల్ ట్రాఫిక్ దక్కించుకుందట.

అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా ఇప్పటికే సినిమా బడ్జెట్ను ఈ రైట్స్ ద్వారా సమంతా రికవరీ చేసేసుకుందంటూ.. అంటే ఇప్పటికే శుభం సినిమాతో సమంత నిర్మాతగా సక్సెస్ అందుకున్నట్లే అంటూ.. నష్టాలు లేకుండా సేఫ్ స్ట్రాటజీతో అదరగొట్టిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా నేడు హైదరాబాదులో మూడు థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్ షోలు కొనసాగుతున్నాయి. మొదటి షోస్‌ హౌస్ ఫుల్‌గా దూసుకెళ్లాయి. ఈ రెస్పాన్స్ చూస్తే మరిన్ని థియేటర్లో ప్రీమియర్ షోలు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ షోలకు వచ్చిన ఆడియన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇక రిలీజ్ డేట్ బుకింగ్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు.