రాజమౌళి హీరోగా నటించిన ఏకైక మూవీ ఇదే.. కానీ తండ్రి చేసిన పనికి మొత్తం రివర్స్..!

టాలీవుడ్ దర్శక‌ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న జక్కన్న.. పాన్ వరల్డ్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. త్వరలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో మహేష్ బాబు హీరోగా.. ఎస్ఎస్ఎంబి 29ను ఆడియన్స్ ముందుకు తీసుకురానన్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఆకట్టుకునేలా మూవీ ఉండ‌నుంద‌ట‌. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఆయన.. కేవలం దర్శకుడుగానే కాదు.. నటుడుగాను ప‌లు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ చిన్న గెస్ట్ రోల్స్ తళ్లుక్కున మెరిసి మాయమయ్యాడు.

SS Rajamouli shares update on his next with Mahesh Babu

కానీ.. ఓ ఫుల్ మూవీని రాజమౌళి హీరోగా నటించాడని చాలామందికి తెలియదు. కారణం సినిమా రిలీజ్ కాకపోవడమే. తండ్రి విజయేంద్రప్రసాద్ వ‌ల్లే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయిందట. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. జక్కన్న చిన్న ఏజ్‌లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పిల్లన‌గ్రోవి పేరుతో సినిమాలో లీడ్ రోల్‌లో నటించాడు. దీనికి కీరవాణి తండ్రి శివశక్తి దత్త దర్శకుడుగా వ్యవహరించారు. విజేందర్ ప్రసాద్ ప్రొడ్యూసర్‌గా.. రాజమౌళిని హీరోగా పెట్టి బాలకృష్ణుడి పాత్రలో నటింపచేశారు. ఇక ఈ సినిమాలో రాజమౌళి సిస్టర్ ఎంఎం. శ్రీలేఖ కూడా ఓ పాత్రలో కనిపించింది. వీరితో పాటే సోమయాజులు, నిర్మలమ్మ లాంటివారు కూడా ఈ సినిమాలో కనిపించారు. ఇక రాజమౌళి ఫ్యామిలీ మొత్తం టెక్నికల్ టీంగా.. ఈ సినిమాలో పనిచేశారు.

Vijayendra Prasad Reveals Why Rajamouli Chose an Adventure Thriller for  Mahesh Babu | cinejosh.com

కీరవాణి మ్యూజిక్ అందించాడు. బ్రాహ్మణ కుటుంబ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయాలని భావించారు. కానీ.. షూటింగ్ దశలో అసలు కష్టాలు మొదలయ్యాయి. బడ్జెట్ క‌ష్టాల‌తో మూవీ ఆగిపోయింది. ఖర్చు మరింతగా పెరిగిపోయింది. ఇంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టే స్తోమతలేక కొంతకాలం ఆ సినిమాను ఆపేశారు. తర్వాత డబ్బు సర్దుబాటు చేసుకుని పూర్తి చేయాలని భావించిన.. ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. డిలే అవుతూ వచ్చింది. ఈలోపల రాజమౌళితో పాటు ఇతర చైల్డ్ ఆర్టిస్టులు కూడా పెద్ద వాళ్లు అయిపోయారు. సీనియర్ నటులు అయితే కొందరు కన్నుమూశారు. దీంతో చేసేదేం లేక ఈ సినిమాను ఆపేసారు. అలా రాజమౌళి హీరోగా వచ్చిన మూవీ మధ్యలోనే ఆగిపోవడానికి ఓ రకంగా తండ్రి విజయేంద్ర ప్రసాద్ కారణమయ్యారు.