గీతా ఆర్ట్స్‌లో లెక్క‌లు మారిపోయాయ్‌.. బ‌న్నీ వాస్ ప్లేస్‌లో ఆమెదే పెత్త‌నం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌ల‌లో గీత సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ అయినా.. వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే గీత ఆర్ట్స్ బ్యానర్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. కాగా.. గీత సంస్థ అధినేత అల్లు అరవింద్. అయన తర్వాత స్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే మాత్రం బన్నీవాస్ పేరే ఎక్కువగా వినిపించేది. పవన్ పొలిటికల్ ఈవెంట్లలోను బన్నీవాస్ త‌న‌వంతుగా సహాయం అందిస్తూ ఉండేవాడు.

అయితే.. తాజాగా బన్నీవాస్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడని.. మెల్ల‌మెల్లగా గీతా ఆర్ట్స్‌కుదూరం అవుతున్నాడని.. ఆయన స్థానాన్ని అల్లు అరవింద్ రిలేటివ్స్ అయినా విద్యా దక్కించుకుందని.. భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్‌లో అన్నింటిలోనూ ఆమె కనిపించనుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. దీనిపై త్వరలోనే బ్యానర్ నుంచి అఫీషియల్ ప్రకటన కూడా రానుందట. ఇక ఈ బ్యానర్ నుంచి తండేల్‌ సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్‌కు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సైతం ఉంది. అయితే ఈ ఓటీటీకి ఆశించిన రేంజ్ లో హైప్ రావడం లేదు.

ఈ క్రమంలోనే లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ రాబోయే రోజుల్లో అంతకంతకు ఎదుగుతూ మరింత సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ హీరోల సినిమాలు సైతం నిర్మించే దిశగా భవిష్యత్ ప్రణాళిక ఉండనుందని సమాచారం. ఇక ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్లో అంటుకుంటున్న గీతా ఆర్ట్స్ బ్యానర్.. ఇతర భాషల్లో సైతం సినిమాలను తెరకెక్కించే సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం డైరెక్టర్ చందు మండేటితో ఈ బ్యానర్ ఎక్కువగా సినిమాలు తీస్తుండడం విశేషం.