టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో వరుస షాక్లు తగులుతున్నాయి. స్టార్ హీరోస్ అంతా దెబ్బ పై దెబ్బ వేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట సమ్మర్లో వస్తాయన్న సినిమాలేవి సమయానికి రాకుండా.. ఎప్పటిలానే వాయిదా పడుతూ తర్వాత ఎప్పటికో రిలీజ్ అయ్యాయి. దీంతో.. గత ఏడాది ఏప్రిల్ నెల అంతా వెలవెలబోయింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా.. వస్తాయనుకున్న సినిమాలు రాకపోగా.. వచ్చిన సినిమాలేవి సక్సెస్ అందుకోవడం లేదు. గతేడాది మార్చి నెల చివర్లో వచ్చిన టిల్లు స్క్వేర్. జూన్ చివర్లో వచ్చిన కల్కి మినహా మరే సినిమాలు సక్సెస్ సాధించలేదు. దీంతో.. సమ్మర్ ఫ్లాప్ల బాటపట్టింది.
ఇప్పుడు 2025 సమ్మర్ కూడా అలానే వృధా అయిపోతుందని అభిప్రాయాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇక ఈ ఏడాది మార్చి ఎండింగ్లో మ్యాడ్ స్క్వేర్ వచ్చి సక్సెస్ అందుకున్నా.. దానికంటే ముందే కోర్ట్ సినిమా వచ్చి మంచి సక్సెస్ను అందుకున్నా కమర్షియల్గా మాత్రం రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు కాలేదు. ఇక ఏప్రిల్ సినిమాల సంగతి మరీ దారుణం. జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ మూడు సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియలేదు. ఇక ఓదెల 2 రిలీజ్ అయిన రోజు మంచి టాక్ ను తెచ్చుకున్న.. ఆ ఊపు మూడో రోజుకే కనిపించకుండా పోయింది. ఇక కళ్యాణ్ రామ్ అర్జన్స్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మొదట పాజిటివ్ టాక్ వచ్చినా.. తర్వాత ఆక్యుఫెన్సీ లేక బ్రేక్ ఈవెన్ లో సగం రావడం కూడా కష్టమైన పరిస్థితి.
ఇక ఈ నెలకు ఫినిషింగ్ టచ్ గా సారంగపాణి జాతకం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మొదట పాజిటివ్ టాక్ వచ్చినా.. కొంతమందిలో నచ్చలేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఇక ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ సినిమా పూర్తి రిజల్ట్ తెలిపోనుంది. ఇలా.. ప్రస్తుతం వచ్చిన సినిమాల హీరోలంతా షాక్ ఇస్తూ డిజాస్టర్ల దిశగా టాలీవుడ్ను నడుపుతున్నారు. ఇక కన్నప్ప, రాజాసాబ్ లాంటి సినిమాలు సమ్మర్లో వస్తాయనుకుంటే అవి.. బోల్తాపడ్డాయి. వచ్చే నెల రావాల్సిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ గురించి భవిష్యత్తులో మాట్లాడాలంటే మిగిలిన ఒకే ఒక ఆప్షన్ హిట్ 3, కింగ్డమ్ సినిమాలు రిలీజై.. పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. కమర్షియల్ గాను మంచి సక్సెస్ అందుకోవడమే. ఈ రెండు సినిమాలపైనే టాలీవుడ్ సమ్మర్ రిజల్ట్ ఆధారపడి ఉంది.