సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగా వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యంగ్ సింగర్ ప్రవస్థి చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన ఈ రియాలిటీ షో ప్రస్తుతం కుట్రలు, రాజకీయాలు, పక్షపాతలతో కొనసాగుతుందని ప్రవస్థి షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ తమకు ఇష్టమైన వారికి మాత్రమే మంచి మార్కులు ఇస్తున్నారని.. సాంగ్ సెలక్షన్ విషయంలోనూ మాకు చెత్త సాంగ్స్ ఇచ్చి.. తమకు ఇష్టమైన వాళ్ళకి వాళ్లకు నచ్చిన మంచి సాంగ్స్ ఇస్తున్నారని.. నచ్చని వారికి కావాలనే వేరే సాంగ్స్ పాడించి ఎలిమినేట్ చేయడం జరుగుతుందని.. ఎప్పటికప్పుడు సునీత తన గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తూనే వస్తుందని ప్రవస్థి వివరించింది.
ప్రవస్థి వ్యాఖ్యలపై జ్ఞాపిక నిర్మాణ సంస్థ, సింగర్ సునీత సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యారు. అయితే.. సునీత ఇచ్చిన క్లారిటీతో వివాదం ముగిసిందని అంతా భావించారు. కానీ.. ప్రవస్థి ఈ వివాదాన్ని ఆపలేదు. ఆమెతోపాటు మరొక్క కంటెస్టెంట్ దీనికి తోడైంది. తాజాగా పాడుతా తీయగా షోపై మరో యంగ్ సింగర్ మాట్లాడుతూ ప్రవస్థి చెప్పిన సంఘటనలు నిజంగానే షోలో జరుగుతున్నాయని.. నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురయిందంటూ చెప్పుకొచ్చింది. మేము అడిగిన సాంగ్స్ ఇవ్వరు కానీ.. వాళ్లకు ఇష్టమైన కంటెస్టెంట్లకు మాత్రం.. మంచిగా అవకాశాలు ఇస్తారు.
ఈ సాంగ్ నా వాయిస్ కి అసలు సూట్ కాదని ఎంత చెప్పినా పట్టించుకోలేదని.. నాకు అసలు సెట్ ఏ కానీ సాంగ్ ఇస్తే నేనెలా పాడాలని.. ఎంతో టెన్షన్ పడ్డ దానికి ఎలాంటి సమాధానం ఇస్తారంటే నీకు ఈ సాంగ్ కీరవాణి గారు ఇవమన్నారు.. లేదా మరెవరో జడ్జ్ ఇవ్వమన్నారు అని చెప్పేసి వెళ్లిపోతారు. మేము కీరవాణి గారిని ఎలా అడగగలము అంటూ నిహా వివరించింది. వాళ్ళు ఇచ్చిన సాంగ్స్ నిజంగానే నా వాయిస్ కు సెట్ కాలేదు. దీంతో సరిగ్గా పాడలేకపోయా. రేపు నిన్ను ఎలిమినేట్ చేస్తున్నామని ముందు రోజే చెప్పి మరి.. అన్నట్టుగానే నన్ను ఎలిమినేట్ చేశారు అంటూ నేహా చెప్పుకొచ్చింది. అయితే ప్రవస్థి చెప్పినట్లు ఎక్స్పోజింగ్ చేయమని మాత్రం నన్ను ఎవరు అడగలేదని ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు ఎదురు కాలేదంటూ నేహా వివరించింది. ప్రస్తుతం నేహా చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.