టాలీవుడ్తో పాటు.. మలయాళ ఇండస్ట్రీలోనూ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నజ్రియా నజీమ్ కు ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ క్వీన్ గా నటనతో సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. గత కొంతకాలంగా సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో నజరియాకు ఏమైందని మలయాళ ఆడియోస్ తో పాటు.. స్నేహితులు, సన్నిహితులు, దర్శక నిర్మతలు కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమెను కలిసే ప్రయత్నాలు చేసినా ఏది వర్కౌట్ కాలేదు. అసలు ఆమె ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియలేదు. కనీసం ఫోన్ చేద్దామన్న ఆమె అందుబాటులో లేకపోవడంతో.. ఆమెకు అసలు ఏమైంది.. అనారోగ్య సమస్యల, లేదా ఏవైనా కారణాల అర్థం కాని పరిస్థితిలో అంతా ఉండిపోయారు.
ఈ క్రమంలోనే నజ్రియా తాజాగా తన ఇన్స్టా వేదికగా ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న ఈ అమ్ముడు రీసెంట్గా సూక్ష్మదర్శిని సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా వేడుకల్లోనూ ఈమె కనిపించలేదు. కనీసం టచ్ లో కూడా లేకపోవడంపై ఆమె రియాక్ట్ అయ్యారు.. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో తాను కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నానని.. అందుకే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, నటినట్టులు ఎవరితోనూ ఫోన్లో కూడా అందుబాటులో లేనని వెల్లడించింది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవాలని.. క్షమించండి అంటూ కోరుకుంది. ఎప్పుడు సోషల్ మీడియా బయట యాక్టివ్ గా కనిపించే తాను.. ఇటీవల కాలంలో ఎవరికి అందుబాటులో లేకపోవడంతో అందరికీ క్షమాపణలు చెప్పుకొచ్చింది.
మిమ్మల్ని అందరిని టెన్షన్ పెట్టినందుకు బాధపడుతున్న అంటూ వివరించింది. త్వరలోనే కోలుకొని అందరి ముందుకు వస్తానని.. జీవితంలో గడ్డుకాలని ఎదుర్కొంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇప్పుడు కోలుకొని మామూలు మనిషిని అవుతున్నానని.. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమాపణలు చెప్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె షేర్ చేసిన పోస్ట్ తో ఫ్యాన్స్లో మరింత ఆందోళన నెలకొంది. కాగా నజ్రియా పోస్ట్ కు స్టార్ బ్యూటీ సమంత రెస్పాండ్ అవుతూ.. లవ్ సింబల్ ఇమేజ్ ని షేర్ చేసుకుంది. ఇక నజ్రియా భర్త ఫాహద్కు కూడా పరిచయాలు అవసరం లేదు. కాగా తాజా పరిణామాల తర్వాత నజ్రియాకు విభేదాలు నడుస్తున్నాయా.. త్వరలోనే విరి విడిపోతున్నారా అనే రకరకాల రూమర్లు వైరల్ గా మారుతున్నాయి.