విజయశాంతి పిల్లల్ని కనక పోవడానికి కారణం అదేనా.. ఆస్తులన్నీ ఎవరికంటే..?

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తన నటనతో సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. దాదాపు అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని సత్తా చాటుకుంది. స్టార్ హీరోలకు దీటుగా తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే.. మెల్లమెల్లగా సినిమాలకు దూరమైనా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే పొలిటికల్ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ అందించేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.

ఇప్పటికీ పొలిటికల్గా రాణిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చాలా కాలం గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటిస్తుంది. అలా రి ఎంట్రిలో మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అర్జున్ సన్ ఆఫ్‌ వైజయంతి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. తన 15వ ఏట‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కాగా.. తెలుగు మాత్రమే కాదు కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ నటించిన విజయశాంతి.. ఇప్పటివరకు 200 కు పైగా సినిమాలతో ఆకట్టుకుంది.

Sarileru Neekevvaru' Is Sankranthi's Biggest Blockbuster - Lady Amitabh  Vijayashanthi - IndustryHit.Com

కాగా కెరీర్ ప్రారంభంలో ఐదువేల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. పదేళ్ల గ్యాప్ లోనే కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. తన భర్త శ్రీనివాస్ ప్రశాంత్ తో వైవాహిక జీవితాన్ని గడుపుతూనే.. 2014లో ఈమె ఆరోగ్యం క్షమించడంతో సర్జరీ చేయించుకుంది. కాగా పెళ్లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్పటివరకు విజయశాంతి పిల్లలు కనకపోవడానికి వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉందట. అది తెలిసి ఇప్పుడు అంత ఆశ్చర్యపోతున్నారు. తన లైఫ్ ప్రజలకు అంకితం చేయాలని ఉద్దేశంతో అమ్మే పిల్లలను సైతం కనకుండా ఉండిపోయింది. అంతేకాదు ఇప్పటికే తను తల్లి పేరున ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. వైద్య, విద్య కోసం మరణానంతరం తన ఆస్తి అంతా ఆ ట్రస్ట్‌కి వెళ్లేలా చేయబోతున్నట్లు విజయశాంతి వెల్లడించింది.