ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతమంది హీరోలు, దర్శకులు రకరకాల కారణాలతో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సినీ ఆడియన్స్లో ఆందోళన మొదలైంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మరో నటుడి మృతి వార్త అందరికి షాక్ను కలిగిస్తుంది.
అది కూడా అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడం మరిన్ని సందేహాలకు దారితీస్తుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుని పాపులారిటీ దక్కించుకున్న రోహిత్ బస్పోర్. తాజాగా ఆయన అస్సాంలోని ఓ జలపాతం వద్ద మరణించి పడి ఉండడంతో ఆయన మృతి దేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు ఇన్ఫరమేషన్ అందించారు.
ఈ క్రమంలోనే స్థానిక సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా దీనిని హత్యగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తును చేపట్టారు. ఇక పూర్త వివరాలు తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేవరకు చూడాల్సిందే.