ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ చాలా స్పెషల్ సీజన్. ఈ క్రమంలోనే మధ్యలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలపై ఎప్పటికప్పుడు హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈసారి పొంగల్ బరిలో ఓ ఇంట్రెస్టింగ్ వార్ నెలకొన్ననుందట. ఆ వార్ ఎవరికో కాదు.. సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అలాగే పాన్ ఇండియన్ స్టార్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్కు మధ్య. ఇద్దరు బడా హీరోలు కావడం.. చిరుతోపాట్టే తారక్ కూడా సంక్రాంతి బరిలో దిగనున్నారు అనే టాక్ వైరల్ అవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
చివరిగా సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి మంచి ఫామ్లో దూసుకుపోతున్నాడు. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్తో.. చిరుకు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేస్తానని ప్రామిస్ చేసిన అనిల్.. పక్క ప్లానింగ్ తో సినిమాను రూపొందిస్తున్నాడు. 2026 సంక్రాంతి బరిలో సినిమాలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే 2026 సంక్రాంతి బరిలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బరిలో దిగేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్.. 2026 జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. కనుక దాదాపు పొంగల్ రేసులో తారక్ ఉన్నట్లే. కాగా.. అప్పుడెప్పుడో 2002లో ఇద్దరు హీరోలు తలపడ్డారు. చిరు ఇంద్ర రిలీజ్ అయిన ఐదు రోజులకే తారక్ అల్లరి రాముడు సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలకు బి.గోపాల్ దర్శకుడుగా వ్యవహరించారు. అయితే అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒకే టైం కు సినిమా రిలీజ్ చేయాల్సిన అవసరం పడింది. ఇక.. కాంపిటీషన్ లో చిరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి 23 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు, తారక్ వార్కి సిద్ధమవుతున్నారు. ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొంది. టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఈ వార్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఇద్దరు హీరోల స్టేటస్లు, మార్కెట్ లెక్కల్లో డిఫరెన్స్ వచ్చాయి. మరి ఇద్దరి మధ్యన క్లాష్ తప్పకుంటే.. ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి.