సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే కేవలం అందం, అభినయమే కాదు.. కాస్తంత లక్ కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మంచి టాలెంట్ ఉన్నా.. లక్ కలిసి రాక ఇండస్ట్రీకి దూరమవుతూ వస్తున్నారు. మరి కొంతమంది ముద్దుగుమ్మలు.. అదృష్టంతో వరుస అవకాశాలను దక్కించుకొని దూసుకుపోతున్నారు. మనం చెప్పుకోబోయే ఈ స్టార్ హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. కేవలం 15 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ దాదాపు 8 భాషల వరకు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళంలోను స్టార్ హీరోయిన్ ఇమేజ్ను దక్కించుకుంది.
అలా.. ఐదేళ్లలోనే స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. అన్ని భాషలను కలిపి వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. తాజాగా.. 14 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతుంది. ఓ మంచి సినిమాలో అవకాశం వస్తే నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు సినిమాలో నటించకపోయినా.. ప్రస్తుతం రూ.2000 కోట్లకు అధిపతిగా మహారాణిగా దూసుకుపోతుంది. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ రంభ. 1993లో రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడకు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. సినిమాల్లో రాజేంద్రప్రసాద్కు జంటగా నటించింది. తర్వాత.. తెలివితో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ స్టార్ హీరోలు అందరి సరసన మెరిసింది.
తెలుగులో చిరు, నాగ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టిన రంభ చివరిగా పెను సింగం సినిమాలో నటించిన మెప్పించింది. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోను మెరిసి కుర్రకారును కవ్వించింది. ఈ అమ్మడు కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే 2010లో కన్నడ వ్యాపారవేత్త అయిన ఇంద్ర కుమార్ పద్మనాభంను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇక తాజాగా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి పోలీసులకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని.. మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. నా కుటుంబం నుంచి నాకు ఎప్పుడు మంచి సపోర్ట్ ఉందని.. ఇప్పుడు ఇక్కడ జడ్జ్ గా ఉండడానికి కూడా ఆ సపోర్టే కారణం అంటూ వివరించింది.