టాలీవుడ్ ప్రముఖ సింగింగ్ రియాలిటీషో పాడుతా తీయగా సింగర్ ప్రవస్థి పేరు గత కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా.. పాడుతా తీయగా షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఈ రియాలిటీ షో లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సింగర్ సునీత, అస్కర్ అవార్డు గ్రహీతలు ఎం ఎం కీరవాణి, చంద్రబోస్లపై షాకింగ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. కేవలం సోషల్ మీడియానే కాదు జనరల్ మీడియాలోనూ ఈమెకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ గా మారాయి.
షోలో తనకు అన్యాయం జరిగిందని.. జడ్జ్లు తనను చీడపురుగులా చేసే వారిని.. ప్రొడక్షన్ వాళ్ళు బాడీ షేమింగ్ చేశారని.. చీరలు ఇచ్చి బొడ్డు కిందకి కట్టుకోమని ఇబ్బంది పెట్టే వారంటూ వివరించింది. కీరవాణి, సునీత, చంద్రబోస్ తనపై ఎంతగానో వివక్ష చూపించారని మండిపడింది. దీనిపై ఇప్పటికే సునీత రియాక్ట్ అయినా.. చంద్రబోస్, కీరవాణి మాత్రం దీనిపై స్పందించలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన గీతాకృష్ణ సింగర్ ప్రవస్థి వివాదం పై రియాక్ట్ అయ్యాడు. ఈ విషయంలో ప్రవస్థికి మద్దతుగా మాట్లాడుతూ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పై షాకింగ్ కామెంట్లు చేశాడు.
కీరవాణి ఒక వ్యభిచారి.. నాకు అతను 8 ఏళ్లుగా పరిచయం.. అంతకంటే ముందు 40 గానే అతని వేషాలు అని నాకు తెలుసు. తెలిసిన ఎందుకులే అని మాట్లాడలేదు. నేనే కాదు చాలామంది అతని గురించి డైరెక్ట్ గా చెప్తారు. అతనిపై దోమ్మెత్తి పోయాల్సిన అవసరం నాకేంటి అని నేను సైలెంట్ గా ఉండిపోయా. ఇటీవల పెద్దోడయ్యాక మాట్లాడడం మానేసాడు అంటూ గీతా కృష్ణ వివరించారు. అమ్మాయిలను సప్లై చేసే వాళ్ళతో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగేవాడట అంటూ కీరవాణి పై ఫోక్స్ కేసు పెట్టాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. టెలివిజన్ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తుంచుకోవాలంటూ వివరించాడు. ప్రస్తుతం గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి.