టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ స్టార్టింగ్లో హీరోగా ట్రై చేస్తున్న సమయంలో.. చిరుతో పాటు.. సుధాకర్ కూడా ఆయన రూమ్లోనే ఉండేవాడట. ఈ క్రమంలోనే వారిద్దరికీ మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరు సినిమాలో ట్రై చేస్తుండగా.. సుధాకర్ కు చాలా స్పీడ్గా.. హీరోగా నటించే ఛాన్స్ వచ్చేసింది. అయితే.. హీరోయిన్ రాధికతో ఆయన తమిళ్లో ఎన్నో సినిమాలు నటించాడు.
అప్పట్లో రాధిక తమిళ్ స్టార్ హీరోయిన్గా సూపర్ హిట్లు అందుకుంటూ రాణిస్తుంది. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా చేస్తున్న నేపథ్యంలో.. రాధికతో సుధాకర్కు పెద్ద గొడవే జరిగిందట. అంతేకాదు.. రాధిక సెట్లో అందరి ముందే సుధాకర్ చెంప చెళ్లు మనిపించిందని.. దీనికి కారణం స్వయంగా సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇది కిడ్జీకే పొగం రైల్ సినిమా షూట్ టైంలో జరిగిందని.. ఈ సినిమా నాలుగో రోజు షూటింగ్ టైంలో ఓ సీన్లో రాధిక పరిగెత్తుకుంటూ రావాలి.. ఆమెను నేను గట్టిగా పట్టుకుని గిరగిర తిప్పాలి.
అయితే.. ఈ సీన్ కి భారతి రాజా డైరెక్టర్. ఇక నేను.. ఆమెను అందుకోబోయే ప్రయత్నంలో చీర కుచ్చుల్లోకి చేయి వెళ్లి ఆమెకు లోపల అంతా గీసుకుపోయింది. వెంటనే.. కోపానికి వచ్చిన రాధిక చెంప చెల్లుమనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో.. సుధాకర్ వెంటనే సారీ చెప్పాడట. తర్వాత మా మధ్య కెమిస్ట్రీ కుదరడం లేదని.. మీరు ఇద్దరు కలిసి డిన్నర్ కు, సినిమాలకు వెళ్ళమని టీం చెప్పారు. అప్పటి నుంచి మాకు మంచి స్నేహం కుదిరింది. తర్వాత ఈ సినిమా రిలీజై సూపర్ డూపర్ హిట్ అవాడమే కాదు.. మొత్తం థియేటర్లలోనే ఏడాది పాటు కొనసాగిందంటూ సుధాకర్ వెల్లడించారు.