గత కొంతకాలంగా దీపావళి పండుగను కూడా మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. సెలవు ఒక్కరోజు ఉన్న కూడా.. వరుస సినిమాలను థియేటర్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా ఈ ఏడాది ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్, శివ కార్తికేయ.. అమరాన్ మూవీలతో పాటు మరిన్ని సినిమాలు ఆడియన్స్ రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ఒకసారి చూద్దాం.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన తాజా మూవీ క. పాన్ ఇండియా లెవెల్లో కంటెంట్ వన్నా థ్రిల్లర్ సినిమా అంటూ ఈ సినిమా చూసినా ఆడియన్స్ రివ్యూలు ఇవ్వడం విశేషం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క తో మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. మరోపక్క మళ్ళీ కూడా హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా తెలుగు స్ట్రైట్ మూవీ లక్కీ భాస్కర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ప్రేక్షకుల ముందే మంచి అంచనాలు నెలకొల్పగా.. దుల్కర్ యాక్టింగ్ ఆడియన్స్ను మెప్పించింది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రోల్ డిజైనింగ్, స్క్రీన్ ప్లే అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్తున్నారు.
ఇక దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరాన్ మూవీ.. దీపావళి కానుకగా రిలీజై తమిళ్, తెలుగులోను మంచి సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతుంది. ముకుంద్గా శివ కార్తికేయన్.. సతీమణి ఇందూ రెబెకా వర్గీస్గా సాయి పల్లవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇదో ఎమోషనల్ రైడ్ అంటూ సినీ ప్రియులు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన భఘీర కూడా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయింది. అయితే సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందని టాక్. అలా దీపావళికి వచ్చిన క, లక్కి భాస్కర్, అమరాన్ మూడు సినిమాలు తెలుగు ఆడియోస్ని మెప్పించగా మిగిలిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయాయి.