టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్యగా, మెగా ఇంటి కోడలి గానే కాదు.. అపోలో ఫార్మసీ మంచి చెడులు చూసుకునే బెస్ట్ బిజినెస్ ఉమెన్ గాను ఉపాసన మంచి పాపులారిటి దక్కించుకుంది. ఈమె అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఇష్టపడతారు అన్న సంగతి తెలిసిందే. ఇక వృత్తిపరమైన విషయాలను కాదు.. సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది ఉపాసన.
ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది ఈ అమ్మడు. ఇందులో తనకు జరిగిన అవమానాల గురించి.. అలాగే తన అత్తమామలు, చరణ్ బిహేవియర్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. ఉపాసన మాట్లాడుతూ పెళ్లయిన కొత్తలో కాస్త బొద్దుగా ఉండేదాన్ని.. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇన్సెల్టింగా మాట్లాడే వారు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసే వారు అంటూ వెల్లడించింది. చుట్టూ ఉండే వాళ్ళు తనని ఎన్ని కామెంట్స్ చేసినా.. కాస్త బాధపడేదాన్ని కానీ.. మనసుకు మాత్రం తీసుకునే దాన్ని కాదు. మన చుట్టూ 100 మంది ఉంటే వాళ్ల మాటలు మనం పట్టించుకోని ఉండడం చాలా కష్టం. మనల్ని ప్రేమించే వారు మాట్లాడినప్పుడు మాత్రమే వాటిని ఆలోచించాలి అంటూ వెల్లడించింది.
పెళ్లి తర్వాత కూడా నా గురించి ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయని కానీ.. అత్త, మామయ్య నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా చాలా కేర్ తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా నన్ను వాళ్ళు చూసుకున్నారని.. నా పట్ల అత్త, మామ, చరణ్ తీసుకునే కేర్.. అలాగే వాళ్ళ ప్రేమకు కన్నీళ్లు వచ్చేస్తుంటాయి.. అంత ప్రేమగా వాళ్ళు నన్ను కేర్ చేస్తారంటూ ఎమోషనల్ అయింది. అలా తన అత్తమామల గురించి భర్త గురించి ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. అది మెగా ఫ్యామిలీ అంటే అంటూ.. కాస్తయినా గర్వం లేని అందరికీ ప్రేమ పంచే వ్యక్తి మెగాస్టార్ అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.