టాలీవుడ్ మెగాస్టార్ విశ్వంభర సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ సినిమాను.. చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పన్ చేశారు. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనే అంశంపై అభిమానులు ఆసక్తి నెలకొంది. తన నెక్స్ట్ మూవీ రైటర్ ఎవరు.. డైరెక్టర్ ఎవరు.. ఏ బ్యాక్డ్రాప్లో సినిమా తీయబోతున్నారనే అంశంపై తాజాగా న్యూస్ వైరల్ గా మారుతుంది. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలలో ఠాగూర్ కూడా ఒకటి. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ను ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే రచయిత బివిఎస్ రవి.. చిరంజీవికి ఇదే తరహాలో సామాజిక సందేశం ఉండేలా ఓ కథను వినిపించారట. అయితే డైరెక్టర్ మాత్రం ఆయన కాదు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవికి కూడా కథ వినిపించారని.. ఆయన ఓకే చెప్పడమే ఆలస్యం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా సోషల్ మెసేజ్తో పాటు.. కమర్షియల్ హంగులను కూడా కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయంపై బి.వి.యస్.రవి.. ఇటీవల ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చిరంజీవి అంటే మొదట అందరికీ పాటలు, డ్యాన్స్ ఏ గుర్తుకొస్తాయి..
అలాంటి సినిమాలు ఆయన చాలానే నటించారు. అలాంటి ఓ పెద్ద స్టార్ బలమైన సోషల్ మెసేజ్ ను ఇస్తే అది ఎంతో మందికి చేరువవుతుంది. ఈ క్రమంలోనే అలాంటి కథను సిద్ధం చేసుకుని వచ్చానని.. బివిఎస్ రవి వెల్లడించారు. విశ్వంభర రిలీజ్ తర్వాత తమ సినిమా ప్రారంబిస్తామని వెల్లడించారు. అయితే చిరు సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. విశ్వంభర తర్వాత ఏ సినిమా చేయాలో ఆయన ఇంకా పిక్స్ కాలేదట. కాగా చిరు లైనప్లో బి.వి.ఎస్. రవి కథ కూడా లైన్లోనే ఉందని.. చిరు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ చెబుతున్నారు.