టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లుగా అవ్వాలని ఆరాటంతో అడుగు పెడుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లుగా మంచి సక్సెస్ అందుకుంటే.. కొంతమంది మాత్రం సరైన అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగాను.. మరి ఏదైనా వృత్తిలోనూ సెటిలైపోతూ ఉంటారు. కానీ.. వారిలో కొంతమంది మాత్రం అతి తక్కువ టైంలోనే భారీ పాపులారిటి దక్కించుకుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో ప్రియమణి వాసుదేవ మనీ కూడా ఒకరు. ఇక ఈమెను ప్రియమణి అని పిలుస్తారు అనే సంగతి అందరికీ తెలుసు.
కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక 2003లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ప్రియమణి.. తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. అలా తారక్ హీరోగా జక్కన్న డైరెక్షన్లో తెరకెక్కిన యమదొంగాలో ప్రియమణి నటించి మెప్పించింది. దీంతో అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. తర్వాత ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, గోలీమార్ లాంటి సినిమాల్లోనూ నటించి మెప్పించింది.
అలాంటి ప్రియమణి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని చాలామంది టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని.. వేరే మతస్తుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని ట్రోల్స్ చేస్తున్నారంటూ ప్రియమణి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వేరే మతపుత్రుని పెళ్లి చేసుకోవడం పట్ల ఇప్పటికీ నేను ఎన్నో ట్రోలింగ్స్ చూస్తున్నాను అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియమణి.. తను ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా అలాంటి ట్రోలింగ్స్ మాత్రం ఆపడం లేదని వెల్లడించింది. 2016లో ముస్తఫారాజ్తో నిశ్చితార్థం జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటి నుంచి ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటున్నానని వెల్లడించింది. ఎంతోమంది స్టార్లు.. కాస్ట్ అలాగే రీజియన్ తో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. కానీ.. నన్నే ఇలా టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇది చాలా బాధాకరమంటూ వివరించింది. కులం మతం అనే రంగులు ప్రేమకు అసలు ఉండవంటూ ఆమె చెప్పుకొచ్చింది. కొంతమంది అసభ్యకరమైన ఫోటోలను పెట్టి మరి నరకం చూపిస్తున్నారని.. ఫైర్ అయింది. ప్రస్తుతం ప్రియమణి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.