ఇండియాలోనే రీఛార్జ్ ఫ్యామిలీ ముకేష్ అంబానీ కుటుంబానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లగ్జరీ లైఫ్ లాడ్ చేస్తూ కోట్లల్లో సంపాదనను కూడా పెట్టుకుంటున్న ఈ ఫ్యామిలీకి సంబంధించి.. ఎవరెవరు ఏం చదువుకున్నారో.. వారి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవాలని ఆశక్తి కచ్చితంగా నెటిజన్స్లో ఉంటుంది. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ క్వాలిఫికేషన్స్.. వైరల్ గా మారుతున్నాయి. అలా ఎవరెవరు ఎంత చదువుకున్నారో ఒకసారి చూద్దాం.
ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ చైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్.. ముకేశ్ అంబానీ తన చదువును ముంబైలో ప్రారంభించాడు. ఏనా హిల్ గ్రాండ్ హై స్కూల్లో తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత.. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో సెకండరీ విద్యను పూర్తి చేశాడు ముఖేష్. ఇక ముంబై విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొంది.. తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్.. రిలయన్స్ను ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషించింది.
నీతా అంబానీ:
ముఖేష్ అంబానీ భార్య నీతో అంబానీ కూడా ప్రేక్షకులకు పరిచయమే. విద్యా దాతృత్వానికి ఎంతో కృషి చేసే నీతా.. ముంబైలో నర్సి మోంజి కామర్స్ అండ్ ఎకనామిక్ కాలేజ్ నుంచి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అలాగే ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. నీతా సాంస్కృతిక కళలను ప్రోత్సహించడానికి ఆసక్తి చూపుతూ ఉంటుంది.
ఆకాష్ అంబానీ:
ముఖేష్, నీతాల పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ ఇండియా, యునైటెడ్ స్టేట్స్లో తన విద్యను పూర్తి చేసుకున్నాడు. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన చదువును పూర్తి చేసిన ఆకాష్.. తర్వాత యునైటెడ్ స్టేట్స్ లో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నాడు.
శ్లోకా మెహత:
ముఖేష్, నీతల పెద్ద కోడలు శ్లోక మెహత 2019లో ఆకాష్ నీ వివాహం చేసుకుంది. న్యూ జెర్సీలో ప్రిన్సిటన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోఫాలోజీలో బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేసుకున్న ఈ అమ్మడు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో లా డిగ్రీ పట్టా పొందింది.
ఇషా అంబానీ:
ముకేశ్, నీతా అంబానీల ఏకైక కూతురు ఇషా అంబానీ సోదరుడి లాగే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత యూనివర్సిటీలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ ముగించి స్టోన్ఫాడ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకుంది. కుటుంబ వ్యాపారాల్లో కాకుండా స్వతంత్రంగా వెంచర్ను ప్రారంభించి రాణిస్తుంది.
ఆనంద్ పిరమాల్:
ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమాల్ శ్లోకమెహతా లానే ప్రిన్సిటన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రపాలజీ బ్యాచిలర్ డిగ్రీ ని పొందడు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి కూడా డిగ్రీ పట్టాపుచ్చుకున్నాడు.
అనంత్ అంబానీ:
ముకేశ్, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ కూడా మొదట ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన విద్యను పూర్తి చేసుకున్నాడు. తర్వాత అన్న ఆకాష్లానే బ్రౌన్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు.
రాధిక మర్చంట్:
అనంత్ అంబానీ భార్య.. రాధిక మర్చంట్ ముంబైలో కేథ్రిడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోవలేమో డిఎల్ వరల్డ్ స్కూల్లో తన చదువును పూర్తి చేసుకుంది. ఈమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ అండ్ ఎకనామికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందింది. అంతేకాదు రాధికకు భరతనాట్యం పై కూడా పట్టు ఉంది. ఈమె బహుమక్కా ప్రతిభాశాలి.