టాలీవుడ్ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ వర్మకు ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తాడని రాజమౌళి నోటి నుంచి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ.. మొదట ఆ సినిమాతో ఇండస్ట్రీలో కెరీర్ను ప్రారంభించాడు. ఇక ప్రశాంత్ సినీ కెరీర్ ఎంతో మంది స్టార్ హీరోలను, దర్శకులను సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ డబ్యూ బాధ్యతలను ప్రశాంత్ వర్మకు అప్పగించేశాడు. ఇక హనుమాన్ సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ ఇటీవల కొన్ని రిజెక్షన్స్ను ఎదుర్కొన్నడంటూ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఎలాంటి దర్శకులైన కథల విషయంలో పలు రిజెక్షన్లను ఎదుర్కోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ హనుమన్ లాంటి ఏకంగా రూ.100 కోట్లకు పైగా లాభాల బాట చూసిన సినిమా సీక్వెల్ కథ విషయంలోను రిజెక్షన్స్ ఎదుర్కోవడం అనేది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ప్రశాంత్ ప్లాన్ ప్రకారం జై హనుమాన్ 2025 సంక్రాంతి కానుకగా బరిలో రావాల్సింది. కానీ.. సమయం దగ్గర పడుతున్న హీరో ఫైనల్ కాకపోవడంతో స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యాడు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా భవిష్యత్తు మల్జీవర్ కథలను స్టార్ హీరోలతో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట.
ఇక జై హనుమాన్ టాలీవుడ్ లో ముగ్గురు హీరోల చుట్టూ తిరుగుతుందని.. అలాగే తమిళ్ స్టార్ హీరోని కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడట. కన్నడ స్టార్ యష్ను కూడా ప్రశాంత్ వర్మ అప్రోచ్ అయ్యాడని.. ఆయన రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక రిషబ్ శెట్టి అయితే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఏదేమైనా జై హనుమాన్తో అంత పెద్ద హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు కూడా.. ఊహించని రిజెక్షన్లు ఎదురవడం అంటే నిజంగానే ఆశ్చర్యం. ఇటీవల రణ్బీర్ సింగ్ కూడా ఓ సినిమాల్లో దాదాపు ఫిక్స్ అయి.. టెస్ట్ షూట్ తర్వాత డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. కారణమేదైనా ప్రశాంత్ వర్మ మరో బిగెస్ట్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటే కానీ ఆయన స్టామినా రిజక్ట్ చేసిన వారికి తెలిసిరాదు.