ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుంటే స్టార్ దర్శకులుగా దూసుకుపోయిన వారిలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కూడా ఒకడు. అప్పట్లో ఆయన తీసిన ప్రతి సినిమా సక్సెస్ అందుకోవడంతో.. దాదాపు టాప్ హీరోస్ అంతా ఆయనతో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపుతూ ఉండేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితమే శంకర్ పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, భారతీయుడు, రోబో లాంటి సినిమాలతో పాన్ ఇండియన్ లెవెల్ సూపర్ సక్సెస్ సాధించాడు. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లతో సినిమాలు రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సినిమాల్లో వాడే టెక్నాలజీ, మేకింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడంతో సినిమాలకు కూడా ఆడియన్స్ క్యూ కట్టేవారు. ఈ క్రమంలోనే శంకర్తో సినిమా చేయాలని ఎంతో మంది ఆరటపడేవారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా శంకర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని భావించేవారట.
కానీ.. శంకర్ స్వయంగా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని రెండుసార్లు భావించారట. కానీ.. ఆ రెండుసార్లు అది వర్కౌట్ కాలేదు. గతంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన 3 ఇడియట్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాదాపు ఆల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.500కోట్ల కలెక్షన్లు కొలగొట్టి ఆశ్చర్యపరిచింది. అప్పట్లోనే రూ.500 కోట్లు అంటే అది సాధారణ విషయం కాదు. అంతేకాదు శంకర్కు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. దీంతో దీనికి రీమేక్ చేసి సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టాలని భావించాడట. ఈ క్రమంలోని మహేష్ బాబును సెలెక్ట్ చేసుకున్నారు. కానీ.. మహేష్ సినిమాల్లోకి అడుగుపెట్టేముందే రీమేక్లో నటించకూడదని షరతు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ అడిగిన ఆయన రిజెక్ట్ చేశారు.
దీంతో పవన్ కళ్యాణ్ ని శంకర్ కాంటాక్ట్ అయ్యారు. అయితే శంకర్.. పవన్ ని అప్రోచ్ అయిన అది రీమిక్ సినిమా కావడంతో పవన్ కాస్త భయపడ్డారు. అమెర్ఖాన్ యాక్టింగ్ చూశాక.. ఆయనకు మరింత భయం వేసిందంట. తను ఆ సినిమా చేస్తే ఇద్దరినీ కంపేర్ చేస్తారు. అప్పుడు అమెరిఖాన్ లాంటి గొప్ప నటుడు ముందు నేను తేలిపోతానని రిజెక్ట్ చేశాడట. ఈ క్రమంలో శంకర్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా ఎంచుకొని సినిమాను పూర్తి చేశారు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ.. పవన్ నటిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండేదని.. అప్పట్లో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఇటీవల శంకర్.. రామ్ చరణ్తో గేమ్ ఛేంజెర్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా మొదట పవన్ కళ్యాణ్ తో తీయాలని శంకర్ రాసుకున్నాడట. నిర్మాత దిల్ రాజుతో కూడా ఇదే విషయాన్ని చెప్పగా.. ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.. చరణ్ ఫైనల్ చేద్దామని అడిగారట. దీంతో శంకర్ ఓకే చెప్పాడు. అలా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, శంకర్ కాంబోలో రెండు సినిమాలు సెట్స్ పైకి రాకుండా మిస్ అయ్యాయి.