ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న SSMB29. యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇక తాజాగా జరుపుకున్న మహేష్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఏదురైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మూవీ టీం దృష్టి అంత SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులపై ఉందట.
ఈ క్రమంలో సినిమాకు సంభందించిన ఓఆసక్తికర వార్త వైరల్ గా మారుతుంది. దానికి కారణం విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇంస్టా వేదికగా షేర్ చేసుకున్న పోస్టే. ఆయన తన ఇన్స్టా స్టోరీలో ఓ బంగారు వర్ణం ఉన్న గద్దరెక్కలను ఉంచి #SSMB29డైరీస్ అనే టాగ్ ను జాతి చేశాడు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెడుతున్నారంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కాగా గరుడ అనే ఈ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు. చాలా రోజుల క్రిందట రాజమౌళి స్వయంగా అనౌన్స్ చేశారు. బాహుబలి సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్ట్ అదేనంటూ ఆయన వివరించాడు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అప్పట్లో రివీల్ చేయలేదు.
ఈ క్రమంలో అప్పుడు రాజమౌళి మైండ్లో ఉన్న గరుడ ఇదేనా.. కాదా.. అనేదానిపై అభిమానులలో సందేహాలు మొదలయ్యాయి. ఇక మహేష్ బాబు ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించానన్నాడు. రాజమౌళి ఆయన్ను ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా అభిమానులకు చూపించేందుకు మేకోవర్ సిద్ధం చేస్తున్నారు. పొడవాటి జుట్టు గడ్డంతో ఇప్పటివరకు మహేష్ అన్న లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో టీపీ విజయన్ పోస్ట్తో గరుడ మళ్లీ వార్తల్లో వైరల్ గా మారింది. అయితే దీనిపై మూవీ టీం క్లారిటీ ఇస్తే కానీ మ్యాటర్ తెలియదు.