టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగింది. ముందు నుంచి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఈరోజు వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నటుడు నాగార్జున నిజం చేశారు. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా తనయుడు నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది … ఈ విషయం అందరితో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది … మా కుటుంబంలోకి సంతోషంగా శోభితను ఆహ్వానిస్తున్నాం.. నూతన జంటకు నా అభినందనలు వీరి జీవితం ఎల్లప్పుడూ సంతోషం ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
8 : 8 : 8 అనేది అనంతమైన ప్రేమకు నాంది అని నాగార్జున తెలిపారు. నాగార్జున కామెంట్ పై పలువురు నెటిజన్లను స్పందిస్తూ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు గతంలో స్టార్ హీరోయిన్ చెన్నైకు చెందిన సమంతతో పెళ్లి అయిన విషయం తెలిసిందే. నాలుగేళ్లు పాటు కాపురం చేశాక వీరిద్దరు వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఇక చై – శోభిత ఎంతో కాలం నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరు ఇద్దరు గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.
సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం చందు మెండేటి దర్శకత్వంలో తంఢేల్ సినిమాలో నటిస్తున్నాడు. శోభిత 2013లో ఫిమేనా మిస్ ఇండియా టైటిల్ విజేతగా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించి గూఢచారి – మేజర్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఏడు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.