సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ప్రుక్షకులను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్తో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిష్శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో.. ఆయన వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.
ఇందులో భాగంగానే ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే పవన్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు రామ్ సినిమాకు కొద్దిగా బ్రేక్ తీసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ ను పూర్తి చేయాలని కాన్సెప్ట్ తో ఉన్నాడని తెలుస్తుంది. అందుకే పవన్ కోసం వెయిట్ చేయడం మానేసిన హరీష్ శంకర్ ఇతర హీరోలతో తన దగ్గర ఉన్న స్క్రిప్ట్లతో సినిమాలు చేసేందుకు ప్లాన్లో ఉన్నాడని సమాచారం. మొత్తానికి హరీష్ శంకర్ తనని తాను స్టార్ట్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంలో బిజీగా గడుతున్నాడు.
ఇదిలా ఉంటే రామ్ కూడా పూరి జగన్నా డైరెక్షన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ డైరెక్షన్లో రామ్పోతునేని నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటికి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తూ వస్తున్న రామ్.. హరిష్ శంకర్తో సినిమా చేయడం వల్ల కెరీర్కి చాలా వరకు ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రామ్ మాస్ మసాలా సినిమాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. హరీష్ శంకర్ కూడా ఇదే జోనర్లో సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. కనుక వీరిద్దరి కాంబోలో మాస్ మసాలా సినిమా వస్తే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.