ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది ఒకానొక సమయంలో ఒకే స్కూల్లో చదువుకొని క్లాస్మేట్స్గా మంచి బాండింగ్ కలిగిన వారై ఉంటారు. అలా అతి తక్కువ మంది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటీ, నటులుగా రాణిస్తూ మంచి ఫామ్లో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇద్దరు స్టార్ హీరోస్ ప్రస్తుతం సౌత్లోనే టాప్లో దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు.
ఇంతకీ ఆ హీరోలు ఎవరో కాదు.. స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరూ ప్రేక్షకులో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా వరకు ఇద్దరు హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి. ఇక వీరి సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయితే అభిమానులు హంగామా మామువులుగా ఉండదు. ఆ రేంజ్లో అభిమానాన్ని సంపాదించుకున్న సూర్య, మహేష్ ఇద్దరు ఒకే స్కూల్లో తమ చదువును పూర్తి చేశారట. ఈ విషయం తాజాగా హీరో సూర్య వెల్లడించాడు.
చెన్నైలోని సెయింట్ బీడ్ స్కూల్ వైపు వెళ్తూ ఉంటే చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయని.. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు నేను అక్కడే చదువుకున్నా.. మహేష్ బాబు నా క్లాస్మేట్ అంటూ వివరించాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా నా క్లాస్మేట్ ఏ. మేము ముగ్గురం కలిసి భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఇంట్లో చేసిన వంటకాలన్నీ ఒకరికి ఒకరం షేర్ చేసుకునేవాళ్ళం. ఆ రేంజ్లో మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉండేది. మా ముగ్గురికి ఎన్నో కాన్వర్జేషన్లు జరుగుతూ ఉండేవి అంటూ వివరించాడు సూర్య. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో సూర్య, మహేష్ ఇద్దరు క్లాస్మేట్స్ వీరిద్దరి మధ్యన ఇంత మంచి బాండింగ్ ఉందా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.