సోషల్ మీడియాలో తలా తోక లేని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అసలు ఆ వార్త నిజమా అబద్దమా అని గెస్ చేయడం తెలుసుకోవడానికే.. ఒక రోజుకు పైగా పట్టిపోతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ఫేక్ వార్తలు మరీ మరీ వైరల్ గా మారుతున్నాయి . కాగా రీసెంట్గా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వారు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ వార్ లోకి మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా వచ్చాడు , అల్లు అర్జున్ ని ఇన్స్టా లో అన్ఫాలో చేసినట్లు ఓ బిగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ న్యూస్ పై అల్లు అర్జున్ కానీ సాయి ధరంతేజ్ కాని స్పందించకపోవడంతో నిజంగానే వీళ్లిద్దరి మధ్య వార్ జరుగుతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .
దానంతటకీ కారణం కూడా మనకు తెలిసిందే. ఏపీ పొలిటికల్ ఇష్యూ ని కుటుంబాల వరకు తీసుకొచ్చుకున్నారు ఈ హీరోలు . అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ సాయి ధరంతేజ్ కు మార్క్ షాక్ ఇవ్వబోతుందట . నిజానికి అల్లు అర్జున్తో కంపేర్ చేస్తే సాయి ధరంతేజ్ వెనకడుగు వేయాలి . అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న హీరో సాయిధరమ్ తేజ్ .. స్టార్ హీరో మాత్రమే .. అది కూడా మెగా ఫ్యామిలీ పుణ్యం అంటూనే ఈ ఎత్తుకైనా ఎదగలిగాడు . ఇప్పుడు ఇదే విషయాన్ని హైలెట్ చేయబోతుందట అల్లు ఫ్యామిలీ .
గతంలో నాగబాబు చేసిన ఒక్క ట్వీట్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఘాటు కౌంటర్స్ వేశారో మనం చూసాం. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కు అదే విధంగా ఘాటు కౌంటర్స్ ఇస్తున్నారు అల్లు ఫాన్స్.. సొంత టాలెంట్ తో పైకొచ్చిన వాళ్లు కూడా ఈ రేంజ్ లో ఓవర్ చేయరు పవన్ కళ్యాణ్ చిరంజీవి అండ చూసుకొని నువ్వు ఈ విధంగా రెచ్చిపోతున్నావ్.. వన్స్ వాళ్ళు నిన్ను తొక్కేస్తే అప్పుడు నీలోని అసలు టాలెంట్ బయటపడుతుంది ..నువ్వేంటో..నీ ఒరిజినల్ స్థాయి ఏంటో తెలుస్తుంది .. అదేవిధంగా బాగా ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . ఇవి తెలిసిన కూడా అల్లు ఫ్యామిలీ సైలెంట్ గా ఉండిపోయింది. సాయి ధరంతేజ్ కి ఇలాంటి పరిస్థితి రావాల్సిందే అనే విధంగానే అల్లు ఫ్యామిలీ కూడా ఆలోచిస్తుంది అంటూ పలువురు జనాలు భావిస్తున్నారు . మొత్తానికి ఒకే ఒక్క తప్పు అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీకి దూరం చేసేసింది..!!