నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్లలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన సిటాడైల్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుని.. త్వరలోనే స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు తన సొంత బ్యానర్ ట్రలాలపై మా ఇంటి బంగారం సినిమాను కూడా శ్యామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమంత మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని దక్కించుకుందంటూ.. జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
దేశభక్తితో కూడిన యాక్షన్ అడ్వెంచర్స్ కథా అంశంతో రూపొందుతున్న ఓ సినిమాకు సమంత హీరోయిన్గా సెలెక్ట్ అయిందని టాక్. అది కూడా బాలీవుడ్ భాద్షా షారుఖ్ ఖాన్ సరసన శ్యామ్ నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలుస్తుంది. రాజ్ కుమార్ హీరోణి లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నరట. ఇక వచ్చే నెలలో ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుందని తెలుస్తుంది.
కాగా చివరిగా షారుఖ్ ఖాన్.. రాజకుమార్ హీరోని కాంబోలో తెరకెక్కిన ఢంకీ సినిమా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా విమర్శకులతోనూ ప్రశంసలు అందుకుంది. మరోసారి కాంబో రిపీట్ కానుందని. ఇందులో సమంత హీరోయిన్గా కనిపించనుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.