ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు ఓపికగా భరించిన అల్లు అర్జున్ ఇప్పుడు తనలోని మరో వైల్డ్ యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అనవసరంగా ఏపీ పొలిటికల్ ఇష్యూలో ఇరుక్కున్నాడు అల్లు అర్జున్.. తన పాటకి తాను సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తన ఫ్రెండ్ వైసిపి కాండిడేట్ కు సపోర్ట్ చేయడం ఆయన కెరీర్ కి బిగ్ మచ్చగా మారిపోయింది.
ఈ విషయంలో జనసేన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఏ విధంగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారో మనం చూసాం. మరీ ముఖ్యంగా కొందరు పరసనల్ అటాక్ గా కూడా తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఫుల్ కోపంతో అల్లు అర్జున్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఎవరైతే తన ఫ్యామిలీ పై తనపై నీచంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో.. వాళ్ళపై సివియర్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడట అల్లు అర్జున్ . సైబర్ క్రైమ్ ని ఆశ్రయించి పోలీస్ కేసు పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారట.
ముఖ్యంగా పర్సనల్ అటాక్ చేస్తూ కుటుంబ సభ్యులను ట్రోల్ చేసేవాళ్లను అస్సలు వదలనే వదలను అంటూ ఫిక్స్ అయిపోయాడట . దీంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇకనైనా ఎవరైతే అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు నోరు మూసుకొని ఉంటే బెటర్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. కాగా తన మామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఒక ట్విట్ చేసిన అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పా రవికి సపోర్ట్ చేస్తూ వైసీపీకి ప్రచారం చేశాడు.. అప్పటినుంచి సోషల్ మీడియాలో బన్నీని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. కొందరు పచ్చి బూతు పదాలు కూడా వాడారు..!!