జనసేన ప్రచార కార్యక్రమాల్లో చెర్రీ.. ఆర్డర్స్ పాస్ చేయడమే ఆలస్యం అంటూ..

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అలానే టాలీవుడ్ లోనూ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయాల్లో వర్కౌట్ కాదనిపిస్తే వారు కామ్‌గా తిరిగి తమ సినిమాలను చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప‌వ‌న్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. అదృష్టం వ‌రించకపోయినా ఎన్నికలకు పోటీ చేస్తూనే వస్తున్నాడు. 2014లో ఎన్నిక‌లో తన పార్టీని మొదలుపెట్టి 2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి నిలబడి ఓడిపోయారు.

అయినా ఓటమిని లెక్కచేయకుండా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఫ్యాన్స్ ని పెంచుకుంటున్నాడు. ఈసారి కూడా పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగినున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ తరఫున మెగా హీరోలు కూడా ప్రచార కార్యక్రమాల్లో అడుగుపెడతారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో జనసేన గురించి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ను ప్రశ్నించగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ నెటింట వైరల్ అవుతూనే ఉన్నాయి. జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ జనసేన పార్టీ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటా.. ఎందుకంటే అక్కడ ఉన్నది మా బాబాయ్ అంటూ వివరించాడు.

Ram Charan In Action For Janasena - ManaTelugu

మరి బాబాయ్ గెలుపు కోసం మీరు పోటీ చేస్తారా అనే ప్రశ్న ఎదురుకాగా.. జనసేన పార్టీ గెలుపు కోసం ఏం చేయడానికైనా ముందుంటాం. అయితే వాళ్ళు ఇలా చేయండి అని చెబితే చాలు చేయడానికి రెడీ అంటూ వివరించాడు. ఇక బాబాయ్ కి ఏదైనా అవసరమైతే ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగేస్తారని.. ఫోన్ల ద్వారా కూడా తనకు ఫ‌లానా అవసరం అంటూ తన పనులు చక చక జరిగేలా చూసుకుంటాడని వివరించాడు. ఇకపోతే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భావిస్తున్న పవన్ ఒక్కసారిగా మెగా హీరోలను రంగంలో దింపితే.. వార్ వన్ సైడ్ అయిపోతుందని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారైన ఎన్నికల బరిలో మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా.. లేదా.. పవన్ ఒక్కడే ఒంటరిగా పోరాడుతాడ చూడాలి.