“నన్ను రెచ్చకొడితే..వాడి చీకటి బాగోతాన్ని బయటపెడతా”.. టాలీవుడ్ హీరో పై వేణు స్వామి సంచలన కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వ్స్ వేణు స్వామి మధ్య ఎలాంటి టఫ్ మాటలు యుద్ధం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ అందరి స్టార్స్ జీవితాలకు సంబంధించిన విషయాలను చెప్తూ ఉంటాడు . అయితే ఎందుకో ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఆయన మాటలను తీసుకోలేకపోతున్నారు. ప్రభాస్ కి ఆరోగ్యపరంగా బాగోలేదు అని .. ఆయనను నమ్మి ప్రొడ్యూసర్ సినిమాలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాస్ వస్తుందని పరోక్షకంగా చెప్పుకొచ్చాడు వేణు స్వామి .

ఈ మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ గా ట్రోల్ చేశారు . అయితే సలార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పుకొచ్చిన వేణు స్వామి మాటలను రివర్స్ కౌంటర్ తో అటాక్ చేస్తూ వచ్చారు. వాడి జాతకాలు ఎవరు నమ్మద్దు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు . దీనికి కౌంటర్ గా వేణు స్వామి మళ్లీ స్పందించారు . ఈసరై కూసింత ఘాటుగానే ఇచ్చిపడేశాడు. వార్నింగ్ కూడా ఇచ్చాడు.

“నేను చెప్పిందే జరిగింది ..ప్రభాస్ జాతకం నా చేతుల్లో ఉంది ..ఆయన ఆరోగ్యం బాగోలేదు .. ప్రభాస్ సలార్ సినిమా కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుందని చెప్పా..ఫైనల్లీ అదే జరిగింది ..నన్ను రెచ్చగొడితే ప్రభాస్ చీకటి బాగోతాన్ని బయటపెడతానంటూ “..ప్రభాస్ ఫ్యాన్స్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు వేణు స్వామి . దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సీరియస్ వాతావరణం నెలకొంది. నిజంగానే ప్రభాస్ చీకటి బాగోతాన్ని బయటపెడతాడా..? వేణు స్వామీ అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!