అందుచేతే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు..!

2023లో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న వారిలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఏడు ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇక వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రానున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ..” మా పెళ్లి ఇండియాలో జరిగితే మా అమ్మానాన్నలు గెస్టులను రిసీవ్ చేసుకోవడానికి మరియు పనులు చేసుకోవడంలో మునిగిపోయేవారు. పెళ్లిని ఎంజాయ్ చేయలేకపోయేవారు.

ఇలా జరుగుతుందని నేను మరియు లావణ్య అనుకుని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. అంతేకాకుండా మా పెళ్ళికి ఫ్యామిలీ మొత్తం ఉండి ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకున్నాము. అక్కడ ఉండే ఏవో కాల్స్ రావడం వంటివి జరిగిన టెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయడానికి ఇటలీలో పెళ్లి చేసుకున్నాం ” అంటూ వెల్లడించాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.