దళపతి విజయ్ హీరోగా.. త్రిష కృష్ణ హీరోయిన్ గా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భాగమైన మరో యాక్టర్ మన్సూర్ అలీఖాన్. ఈ సినిమా హిట్ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటు త్రిష పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్గా వైరల్ అయ్యాయి. వీటిపైన స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ యాక్టర్ కుష్బూ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మన్సూర్ నీ విమర్శించారు. త్రిష కూడా మన్సూర్పై కౌంటర్ వేసింది.
అయితే ఈ వివాదం పై త్రిష కు క్షమాపణలు చెప్పిన మన్సూర్ దానితో ఆ వివాదాన్ని వదలలేదు. తనను అవమానించారంటు చిరు, కుష్బూ, త్రిషాలపై పరువు నష్టం దావా వేశాడు, సుమారు కోటి రూపాయల మేర దావ వేయడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మన్సూర్ అలీ ఖాన్ తమిళ్ పరిశ్రమలో సహనటుడుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం తర్వాత మన్సూర్ మరింత పాపులర్ అయ్యాడు. త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూం సీన్ ఉంటుందని భావించానని.. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులు చేసినట్లే ఆమెను బెడ్ రూమ్ కి తీసుకొచ్చాను అని అనుకున్నాను.. నేను చాలా రేప్ సీన్స్ లో నటించాను. ఇది నాకు కొత్త కాదు అంటూ మన్సూర్ కామెంట్స్ చేశాడు.
దీనిని త్రిష వెంటనే ఖండించగా, చిరంజీవి, కుష్బూ చిన్మయి శ్రీ పద.. సహ పలువురు స్టార్లు తీవ్రంగా ఖండించారు. అయితే వీటిపై మన్సూర్ స్పందిస్తూ నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని నేను మాట్లాడిన ఇంటర్వ్యూ లో కొంత భాగాన్ని మాత్రమే ఎడిటింగ్ చేసి అలా తప్పుగా చూపించారని దానిని త్రిష తప్పు పట్టి ఉంటారని మొదట చెప్పుకొచ్చిన.. మన్సూర్ తరువాత చిరంజీవి, కుష్బూలాంటివారు ఆ వివాదంపై స్పందించి అతడిని విమర్శించడంతో అందరిపై ఫైర్ అయ్యాడు. అసలు విషయం తెలియకుండా నాపై కామెంట్స్ చేశారంటూ వారిపై పరువు నష్టం దాబా వేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్టే తాజాగా చిరు, కుష్బు, త్రిషాపై పరువు నష్టం దాబా వేశాడు.