బిగ్‌బాస్ కంత్రి ప్లాన్.. రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్లో పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్.. (వీడియో)

బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫినాలే జరగబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుతం ఉన్న బ‌జ్‌ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలోనూ పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడా అతని పేరు మారి మోగిపోతుంది. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ అంటూ అన్‌అఫిషియల్ ఓటింగ్ పరంగా కూడా తెలుస్తుంది. సాధారణ ఓటింగ్ లో కూడా పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నాడు.

గురువు శివాజీ ని మించి ఓట్లను సంపాదించుకుని మొదటి స్థానంలో దూసుకుపోతున్న పల్లవి ప్రశాంత్‌కి ప్రేక్షకులంతా వరుస పెట్టి ఓట్లు గుద్దుతున్నారు. అయితే ఓటింగ్ కోసం పల్లవి ప్రశాంత్ కు కేటాయించిన ఫోన్ నెంబర్ గత రెండు రోజులుగా బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. రైతు బిడ్డకు ఓట్లు పడకుండా బిగ్బాస్ ఇలాంటి కంత్రి ప్లాన్ వేశాడని అతని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కావాలనే పల్లవి ప్రశాంత్ నెంబర్‌ను మాత్రమే బ్లాక్ లో పెట్టారని.. అదే టైంలో అమర్‌దీప్‌కు కాల్ చేస్తుంటే రింగ్ అవుతుందని.. ఓ వీడియోను కూడా షేర్ చేస్తూ బిగ్ బాస్ పై ఫైర్ అయ్యారు. ప్ర‌శాంత్‌కి బిగ్‌బాస్‌ 8886676905 అనే నెంబర్ కేటాయించారు.

అయితే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా రైతుబిడ్డకు ఓటింగ్ చేయవచ్చు. కానీ ప్రస్తుతం ఈ నెంబర్ కి కాల్ చేసేస్తుంటే రింగ్ కావడం లేదు. జస్ట్ హోల్డ్ లో ఉన్నట్లు సౌండ్ వస్తుంది. అదే టైంలో ఇతర కంటిస్టెంట్లకు ఎవరికి ట్రై చేసినా అందరి నెంబర్లు వెంటనే రింగ్ అవుతున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్ ని ఓడించేందుకు బిగ్బాస్ ఏ కావాలని ఇలాంటి కుట్ర చేశాడు అంటూ ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున దృష్టికి తీసుకువెళ్లాలంటూ ఫ్యాన్స్ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే నిజంగానే పల్లవి ప్రశాంత్ ఓటింగ్ విషయంలో కుట్ర జరిగిందా. లేదా టెక్నికల్ ప్రాబ్లమా అన్నది వేచి చూడాలి. కాగా ఫోన్ నెంబర్ ప‌ని చేయకపోయినా ప్రశాంత్‌ 41% ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.