స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వరన్ కథ, దర్శకత్వం వహించారు. నివేదిత సతీష్, జాన్ సురేష్ కుమార్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఇదే టైంలో రజనీకాంత్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. తెలైవర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమాతో పోటీ పడేందుకు కెప్టెన్ మిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకి డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయంపై మూవీ ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చేశారు. కెప్టెన్ మిల్లర్ సినిమాని ముందుగా నిర్ణయించిన ప్రకారమే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
దీంతో సంక్రాంతికి మాజీ మామ, అల్లుళ్ళ మధ్య వార్ తప్పట్లేదు. అదే విధంగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో రెండు సినిమాలు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉండబోతుందని ఆసక్తి సినీవర్గాలతో పాటు ఇరు హీరో వర్గాల ఫ్యాన్స్ కి కూడా మొదలైంది. కెప్టెన్ మిలర్ 2024 జనవరి 15న రిలీజ్ కాబోతుంది. లాల్ సలాం సంక్రాంతికి విడుదల చేస్తారని ప్రకటించారు.. సరైన డేట్ ఫిక్స్ కాలేదు.