చావు అంచుల వరకు వెళ్లి వచ్చా.. కత్రినా కైఫ్ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్లేశ్వరి సినిమాతో విక్టరీ వెంకటేష్ స‌ర‌స‌న‌ నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమాలో మెప్పించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ కలెక్షన్లను అందుకుంటుంది.

Katrina Kaif

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా కైఫ్‌ తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈ ఈవెంట్లో కత్రినా మాట్లాడుతూ తను గతంలో ఓ భయంకరమైన సంఘటనను ఫేస్ చేశానని. చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డానంటూ కామెంట్స్ చేసింది. గతంలో ఓసారి హెలికాప్టర్లో జర్నీ చేస్తూ ఉండగా హెలికాప్టర్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని.. దాంతో ఒకసారిగా హెలికాప్టర్ వేగంగా నేల‌ వైపుకు దూసుకు వస్తుందని.. చాలా కంగారు పడిపోయాను అంటూ వివరించింది.

నా చావు ఏంటి దేవుడా ఇంత భయంకరంగా రాశావు.. నాకు ఏదైనా సరే నా తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి అని ఆ క్షణంలో కోరుకున్నానని..ఈ రోజు నా చావు కాయం అనుకున్నాన‌ని అయితే హెలికాప్టర్ ఎంత వేగంగా దూసుకు వచ్చినప్పటికీ ఆ ప్రమాదంలో నాకు కేవలం స్వల్ప గాయాలు అయ్యాయని.. అలా చావు నుంచి తృటిలో బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్. కత్రినా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.