బన్ని కంటే స్టార్ హీరో గా మారిన చరణ్ .. కుళ్లుతో అల్లు అరవింద్ అంత పని చేసాడా..?

సాధారణంగా ఎవరైనా మనిషి బాగుపడుతున్నారు అన్నా.. పైకి ఎదుగుతున్నారు అన్నా.. మనకంటే లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నా.. కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది . పట్టలేనంత కోపం వచ్చేస్తుంది . వాళ్ళని ఎలాగైనా సరే దిగజార్చాలి డౌన్ ఫాల్ చేయాలి అని చాలామంది జనాలు భావిస్తూ ఉంటారు. అలా ఆలోచించే జనాలు మనలో ఎంతోమంది ఉంటారు . కేవలం సామాన్య జనాలే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి స్టార్స్ ఉన్నారు . అది కూడా టాప్ మోస్ట్ పబ్లిసిటీ పాపులారిటీ ఉన్న స్టార్స్ అంటూ లేటెస్ట్ గా ఇండస్ట్రీని ఓ సెన్ సేషనల్ న్యూస్ కుదిపేస్తుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న అల్లు అరవింద్ ఎలాంటి హిట్ ట్రాక్ లో ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి ఏకంగా డబుల్ -ట్రిపుల్ ప్రాఫిట్స్ అందుకుంటూ వచ్చే అల్లు అర్జున్ తన కొడుకు విషయంలో చేసిన ఓ చెత్త పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాతోనే మెగా పవర్ స్టార్ ఓ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఎలేయబోతున్నాడు అంటూ సినీ ప్రముఖులు సినీ విశ్లేషకులు అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ ఓర్వలేని అల్లు అరవింద్ తన కొడుకు కన్నా రామ్ చరణ్ పైకి ఎదిగిపోతున్నాడని తెలిసి చరణ్ తో తెరకెక్కించాలి అనుకున్న కొన్ని సినిమాలను పరోక్షకంగా డైరెక్టర్లకు మా కొడుకుతో చేయండి అంటూ హింట్ ఇచ్చేవాడట .

అలాగే రాంచరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మగధీర సినిమాను సైతం అల్లు అర్జున్ తో చేయించాలి అని రాజమౌళి వద్ద తెగ తాపత్రయపడ్డారట . అప్పుడే మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయిన చిరంజీవి మగధీర సినిమాను రామ్ చరణ్ కి వచ్చేలా చేశారు . దీంతో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ అల్లు-మెగా ఫ్యామిలీకి పడడం లేదని వార్తలు రావడంతో కొందరు ఆకతాయిలు ఈ వార్త ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి..!!