గర్భం దాల్చకుండా పిల్లలను క‌న్న స్టార్ హీరోయిన్లు వీళ్లే….!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ సెలబ్రిటీలు అద్దె గర్భాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. వారు తమ అందచందాలను కాపాడుకునేందుకు. ఆ పురిటి నొప్పుల బాధను తప్పించుకునేందుకు రకరకాల కారణాలతో గర్భం దాల్చకుండా పిల్లలు కంటారు. ఇలా పిల్లల్నికనే విదానినే మనం సరోగసి విధానం అంటాం. విదేశాలలో అక్కడున్నవారు ఎక్కువగా ఇలా పిల్లల్ని కంటారు. ఇది మన దేశంలో ఇలా పిల్లల్ని కనటం చట్టరీత్యా నేరం.

Top Bollywood celebrities who chose surrogacy for parenthood | Hindi Movie  News - Times of India

కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాత్రమే ఇలా అద్దె గర్భాలతో పిల్లల్ని కనవచ్చు అని చట్టాలు చెబుతున్నాయి. వీటిని ఎవరు పట్టించుకొవ‌టం లేదు. తాజాగా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టారు. దీంతో ఇప్పుడు ఈ అద్దె గర్భాల ద్వారా పిల్లలు కన్నా స్టార్ సెలబ్రిటీల లిస్ట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మన టాలీవుడ్ లో ఇలా అద్దె గర్భం ద్వారా పిల్లలు కన్నవారిలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి.. ఆమె సరోగసి విధానం ద్వారానే తన కూతురికి జన్మనిచ్చింది.

Surrogacy, the Bollywood trend Malayalam industry yet to catch up with

ఇక పలువురు బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇలానే ఆద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నారు. శిల్పా శెట్టి, ప్రీతి జింటా, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దంపతులు, ప్రియాంక చోప్రా, సన్నీ లియోన్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దంపతులు, ఏక్తా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అంద‌రూ ఆద్దె గర్భం ద్వారానే పిల్లలను కన్నారు. నయ‌న‌తార ఈ విధానంతో పిల్లలు క‌న‌డంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.