టాలీవుడ్లో శరీర ఆకృతి గురించి అవమానాలను ఎదురుకుంటున్న హీరోయిన్లు వీళ్లే!

సెలిబ్రిటీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. పేరు ,ఫేమ్ తో పాటు కలర్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు .బిందాసుగా ఉంటారని అంత అనుకుంటారు .అయితే ఈ ఫేమ్ తో పాటు మనసును గాయపరిచే విషయాలు ,మాటలు ,మానిసిక వేదనలు మిగిల్చే సంఘటనలు ఉంటాయి .ఆ నెగిటివిటీని ,బాడీ ని బాడీ సెమినింగ్ ని పేస్ చేయటానికి ఫైటింగ్ చేస్తున్న వారు ఉన్నారు .సాయి పల్లవి పెర్ఫార్మన్స్ కి ,డాన్సుకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు .సౌత్ ఇండియా నుండి మొదలుపెడితే నార్త్ ఇండియా వరకు ఫ్యాన్స్ అంత సాయి పల్లవి పెర్ఫార్మన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు .అయితే శ్యామ్ సింగ రాయ్ వచ్చిన తరువాత సాయి పల్లవి లుక్ ని కొంత మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు .అందంగా కనిపించలేదని ,పింపుల్స్ తో కనిపించిందని కామెంట్ చేశారు .దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరాజన్ కూడా స్పందించారు .బాడీ సెమింగ్ తగదు అని చెప్పారు .

టాలీవుడ్లో సూపర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది .ఆ తరువాత బాహుబలితో నార్త్ ఇండియాలోనూ అభిమానులని సంపాదించుకుంది .అయితే అనుష్క సైజు జీరో సినిమా కోసం బరువు పెరిగాక అభిమానం స్థానంలో ట్రోల్ జరిగాయి .స్లిమ్ నుండి సుమో లాగా ఇలా మారిందని ట్రోల్ చేసారు .ఈ బాడీ సెమింగ్ తో కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరంగా ఉన్నది .గడ్డలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ ఆయితికి మంచి ఫాలోయింగ్ వచ్చింది .ఈ సాంగ్ తరువాత డింపుల్ కి హీరోయిన్గా అవకాశాలు కూడా పెరిగాయి .రవి తేజతో ఖిలాడీ సినిమా చేస్తుంది.ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో డింపుల్ కాస్త కలర్ తక్కువ అని ఎవరు అవకాశాలు ఇవ్వలేదట .అయితే గడ్డలకొండ గణేష్ తరువాత డింపుల్ కి ఫేట్ మారింది .మనిషికి కట్ అవుట్ కంటే కంటెంట్ ముఖ్యమని సినిమాలో ఎన్నోసందర్భాలలో చెప్పారు .