మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఇటీవల మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. అయితే అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా మా లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించే ఎందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
అయితే ప్రముఖ సామాజిక కార్యకర్త సునీత కృష్ణ ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉంటారని వెల్లడించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ పేరిట ఈ కమిటీని ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందని మంచు విష్ణు తెలియజేశాడు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా ఉంటారని చెప్పుకొచ్చాడు.
మహిళా సాధికారత కోసం ఈ కమిటీ పని చేస్తుందని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ కమిటీ మెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తానని తెలియజేశాడు. దీంతో మా లో ఉండే మహిళలు మంచు విష్ణుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి డిసిషన్ తీసుకోవడం కేవలం మంచు విష్ణు కే సాధ్యం అని చెప్పుకోవచ్చు.
#MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF
— Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021