చైతు-సామ్‌ల జీవితంలో నిప్పులు పోసిన సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ జోడిగా ఉన్నటువంటి సమంత అక్కినేని.. నాగ చైతన్యల బంధానికి ఈ రోజున బ్రేక్ పడింది. గత పది సంవత్సరాలుగా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్న వీరు 2017 వ సంవత్సరం లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య తో విడాకులు తీసుకోవడానికి కొన్ని కారణాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఎక్కువగా గ్లామరస్ పాత్రలో నటించడమే అక్కినేని కుటుంబానికి ఇష్టం లేదనే విషయం ఇప్పుడు ఎక్కువగా ప్రచారం అవుతోంది. అందుచేతనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ కూడా చాలా బోల్డ్గా నటించడంతో.. ఇంకా తీవ్రమైన పరిమాణానికి దారితీసిందని చెప్పవచ్చు.

ఇక ఈ మధ్య కాలంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఇక ఈ సినిమాతో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ కారణం చేతనే.. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య సాయి పల్లవి ప్రేమలో పడడానికి ముఖ్యకారణం.. ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ ఆమె స్కిన్ షో చేయని చెప్పడమే కారణం తెలుస్తోంది. కానీ నాగచైతన్య సమంత విడిపోవడం తీసే తమ అభిమానం జీర్ణించుకోలేకపోతున్నారు.