ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా తేలియజేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనపై మనోజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. `సీఎం జగన్ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. […]
Tag: ysrcp
అన్న దూరం పెట్టినోళ్లంతా చెల్లెలు చెంతకు..!
కారణాలు ఏవైనా కావొచ్చు గాక.. అన్నయ్య వారిని దూరం పెట్టాడు. ఒకప్పట్లో వారందరూ కూడా ఆ అన్నయ్య కోసం, అన్నయ్యను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం కోసం అహరహమూ పరితపించిన వారే. కానీ.. వారందరినీ అన్నయ్య దూరం పెట్టాడు! కాలక్రమంలో వారిలో చాలా వరకు తెరమరుగే అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వారందరికీ కొత్త ఆదరవు దొరికినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చూపిస్తానంటూ షర్మిల పెట్టిన రాజకీయ పార్టీకి ఎవరెవరి మద్దతు ఉండబోతోందో […]
సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ..సైడైన నాగార్జున..కారణం అదేనట?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]
ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?
ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]
వైసీపీలో కేవీపీ బావమరిది సత్తా ఎంత ?
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజకీయాల రగడ జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ – మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్బాబు ( సీనియర్ పార్లమెంటేరియన్ కేవీపీ రామచంద్రరావు బావమరిది) ఓ వైపు .. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా, ఆయన అనుచరులు మరోవైపుగా ఉంటూ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఎంపీగా శ్రీధర్ ఉన్నా చింతలపూడి వరకు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీలకంగానే […]
మంత్రి అవంతి శ్రీనివాస్.. వైరల్ గా మారిన ఆడియో..?
రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం పార్టీ వైయస్ఆర్ పార్టీ కాబట్టి ఇందులో జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తూ ఉన్నాడు. మంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన మంత్రి అనే విషయం మర్చిపోయి, కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడడంతో ఎవరో తెలియని కొందరు ఆయన మాటలను రికార్డ్ చేసి, ఆడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా […]
ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?
వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) ప్రైవేటీకరణ అవుతుందో, లేదో పక్కన పెడితే ప్రైవేటు విషయం కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో సానుభూతిని సంపాదించాలని భావిస్తున్నాయి. అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే అందరికంటే ఓ అడుగు ముందుకేసిన వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీఎస్పీ పరిరక్షణకు మద్దతుగా రాజీనామా చేసినా ఆ తరువాత స్పీకర్ […]
ఏపీ సర్కారుకు మరో సలహాదారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]
ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!
ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]









