ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా తేలియజేశాడు.
ఈ నేపథ్యంలోనే జగన్తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనపై మనోజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. `సీఎం జగన్ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను.
మంచి చేస్తున్న మీలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు` అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. దాంతో ఆయన ట్వీట్ కాస్త వైరల్గా మారింది. అయితే ఇంత సడెన్గా మనోజ్ సీఎం జగన్ను ఎందుకు కలిశాడు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
https://twitter.com/HeroManoj1/status/1434757310522396677?s=20